ఖైరతాబాద్లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇక్కడ వరద నీటి సమస్య ఏర్పడటంతో పాటు రోడ్లు బురదమయంగా మారుతాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇక్కడ స్టార్మ్ (వరదనీటి) వాటర్ పైపులైనుతో పాటు సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందుకు నిధులు సైతం మంజూరు కాగా, టెండర్ల ప్రక్రియ ముగిసి పనులు ప్రారంభమయ్యాయి. ఆ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి.
– ఖైరతాబాద్,డిసెంబర్ 1
కొన్ని ఏండ్లుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయం మీదుగా ఉన్న లైను ద్వారా వరదనీరు ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో వచ్చి చేరేవి. ఆ నీటిని క్రమబద్ధీకరించేందుకు రూ.20లక్షల వ్యయంతో 100 మీటర్ల నూతన పైపులైను నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పైపులైనును సీఐబీ క్వార్టర్స్ జంక్షన్లో ఉన్న ప్రధానమైన లైన్కు కలుపుతారు. తద్వారా వరద నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలాగే మరో రూ.23లక్షలతో 200 మీటర్ల నూతన సీసీ రోడ్డు నిర్మాణం సైతం చేపట్టారు. దీంతో వానకాలంలో బురద సమస్య లేకుండా పోతుంది.
ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం సమస్య ఉంది. ముందుగా సీవరేజీ, డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ పనులు పూర్తయిన తర్వాత సీసీ, వీడీసీసీ రోడ్లను వేస్తాం. ప్రస్తుతం రూ.20లక్షలతో పైపులైను, రూ.23లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు తది దశకు చేరుకున్నాయి.