హైదరాబాద్: రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ పురాణం సతీష్ శాసన మండలిలో ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫున మంత్రి సమాధానం ఇచ్చారు. ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందని, నివేదిక వచ్చిన అనంతరం సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ తరహా ట్రిబ్యునళ్లు ఉన్నాయని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక లాభ నష్టాలపై పూర్తిస్థాయి చర్చ అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.