న్యూఢిల్లీ : రోజూ ఉదయాన్ని మనం ఎలా ఆరంభిస్తాం..ఆహారంగా ఏం తీసుకుంటామనే దానిపై ఆ రోజు మనం ఎంత ఉత్సాహంగా, హుషారుగా ఉంటామనేది ఆధారపడిఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఉదయాన్నే ఆరోగ్యకర ఆహారం (Health Tips) తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. కొందరు కాఫీ కప్పు, ఛాయ్తో రోజును ప్రారంభిస్తుండగా మరికొందరు డీటాక్స్ డ్రింక్తో తమ రోజును ప్రారంభిస్తారు. ఇలాంటి ఆరోగ్యకర ప్రత్యామ్నాయం ఉదయాన్నేబెల్లంతో పసుపును తీసుకోవాలని సూచిస్తున్నారు.
వింటర్లో ముఖ్యంగా ఈ డైట్ ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు రూపాలి దత్తా చెబుతున్నారు. పసుపు కొమ్ములు, బెల్లం వింటర్ స్పెషల్ ఫుడ్స్ అని ఇవి లోపలి నుంచి శరీరానికి మేలు చేస్తాయని తెలిపారు. సువాసనతో పాటు కొద్దిగా చేదుగా ఉండే పసుపు కొమ్ములను సంప్రదాయ వైద్య ఔషధాల్లో వినియోగిస్తారు. ఫ్రీ రాడికల్స్ను న్యూట్రలైజ్ చేసే పైటోన్యూట్రియంట్స్ వీటిలో ఉండటంతో పాటు ఇవి కణాలు దెబ్బతినకుండా కాపాడతాయని జాన్ హాప్కిన్స్ అధికారిక వెబ్సైట్ ఆర్టికల్ పేర్కొంది.
ఇక రోజూ ఉదయాన్నే బెల్లం తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ, జీవక్రియలు మెరుగై మొత్తం శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. రోజూ పసుపు కొమ్ములు, బెల్లం కలిపితీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్ధ మెరుగుపడటంతో పాటు శ్వాసకోశ సమస్యలు నివారించవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇక రోజుకు ఒక టీస్పూన్ బెల్లంతో కలిపి ఐదు నుంచి పదిగ్రాముల రా టర్మరిక్ను తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా సూచిస్తున్నారు.
Read More :