బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక బస్సులో వీధి కుక్క ప్రయాణించింది. (stray dog rides bus) ఇది చూసి ఆ బస్సులోని ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. అయితే అది ఎవరినీ ఏమీ చేయకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊరట చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మారతహళ్లి నుంచి ఇందిరానగర్కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులోకి ఒక కుక్క ఎక్కింది. ఆ బస్సులో కొంత దూరం అది ప్రయాణించింది. తొలుత కుక్కను చూసి ప్రయాణికులు కొంత షాక్ అయ్యారు. అయితే అది స్నేహపూర్వకంగా ఉండటంతో కొంత మంది ముచ్చట పడ్డారు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బెంగళూరు వాసులు జంతు ప్రేమికులని, దీనికి ఇదే నిదర్శమని కొందరు కొనియాడారు. ఇందులో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని పేర్కొన్నారు. అయితే బీఎంటీసీ బస్సుల్లో పెంపుడు జంతువులను అధికారికంగా అనుమతిస్తారని, సగం టికెట్ ఛార్జీ వసూలు చేస్తారని మరొకరు తెలిపారు. మరోవైపు ఈ కుక్క బస్సు దిగినప్పుడు వాహనాల శబ్దానికి బెదరకుండా, ట్రాఫిక్కు అడ్డంగా పరుగులు తీయకుండా జాగ్రత్త వహించాలని మరొకరు సూచించారు.
View this post on Instagram
A post shared by Whatsaround Bengaluru | Food | Travel | Life style (@whatsaroundbengaluru)