న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో ఒత్తిడితో చిత్తవడంతో పాటు ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్ అధికంగా తీసుకోవడంతో మలబద్ధకంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. మలబద్ధకం దీర్ఘకాలం కొనసాగితే అది పైల్స్ వంటి వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంది. మలబద్ధకాన్ని నివారించాలంటే మెరుగైన జీవనశైలితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రోజుకు సరిపడా నీరు తాగడం. నిత్యం పండ్లు, ఆకు కూరలు, తాజా కూరగాయలతో పాటు తృణధాన్యాలు ఆహారంలో విధిగా భాగం చేసుకోవాలి. చక్షు విత్తనాలతో మలబద్ధకాన్ని నివారించవచ్చని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్నీత్ బాత్రా ఇన్స్టాగ్రాం పోస్ట్లో పేర్కొన్నారు.
ఈ విత్తనాలను పౌడర్గా చేసుకుని లేదా జ్యూస్ రూపంలోనూ తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు. చక్షు సీడ్స్తో శరీరంలో వాపు ప్రక్రియను నివారించడంతో పాటు మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చని లవ్నీత్ బాత్రా వివరించారు.