న్యూఢిల్లీ : రోజుకు ఐదు గంటల కంటే తక్కువ నిద్రించేవారు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించే వారితో పోలిస్తే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) బారిన పడే ప్రమాదం రెండింతలు అధికమని (Health Tips) తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పీఏడీ అంటే కాళ్లలో ధమనులు మూసుకుపోవడంతో రక్త ప్రసరణ తగ్గి స్ట్రోక్, గుండె పోటు ముప్పు పెరుగుతుంది. పీఏడీ ముప్పు తగ్గేందుకు రాత్రి వేళ ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రించడం మంచి అలవాటని అధ్యయన రచయిత కరోలింక్స్ ఇనిస్టిట్యూట్, స్వీడన్కు చెందిన షు యువాన్ పేర్కొన్నారు.
శారీరకంగా చురుకుగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో పీఏడీ ముప్పును తగ్గించుకోవచ్చని చెప్పారు. పీఏడీ రోగుల్లో నొప్పి నివారణ ద్వారా వారిలో సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలన్నారు. 6,50,000 మంది నిద్ర అలవాట్లు, పగటి నిద్రతో పీఏడీ ముప్పు వంటి అంశాలపై అధ్యయనం చేసి ఈ వివరాలను పరిశోధకులు నిగ్గుతేల్చారు.
తక్కువ సమయం నిద్రించే వారిలో పీఏడీ ముప్పు అధికంగా ఉన్నట్టు అధ్యయనంలో గుర్తించారు. యూరోపియన్ హార్ట్ జర్నల్ ఓపెన్లో అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. ఇక రాత్రిళ్లు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రించే వారిలో ఏడెనిమిది గంటలు నిద్రించే వారితో పోలిస్తే పీఏడీ ముప్పు 24 శాతంగా ఉందని అధ్యయనం పేర్కొంది.
Read More :
Health tips | నిద్రలేమి సమస్య మిమ్మల్ని చికాకు పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే
Bacteria on Bottles | టాయిలెట్ కుండీపైన కంటే మంచినీళ్ల బాటిల్పైనే బ్యాక్టీరియా ఎక్కువట..!