న్యూఢిల్లీ : జంక్ ఫుడ్ విపరీతంగా అందుబాటులోకి రావడంతో రోజువారీ తీసుకోవాల్సిన సాల్ట్ కంటే ఎంతో అధికంగా సాల్ట్ వాడకం పెరిగింది. ఉప్పు అధిక వినియోగం ఆరోగ్యానికి పెను ముప్పని నిపుణులు వారిస్తున్నా ఉప్పును మోతాదు మించి వాడుతుండటం పెరుగుతున్నది.
ఉప్పు ఆహార పదార్ధాల రుచిని పెంచేందుకు వాడినా హై సోడియంతో కూడిన ఆహారం మోతాదు మించితే బ్రెయిన్పై ప్రతికూల ప్రభావం పడుతుందని అది డిమెన్షియా వంటి వ్యాధులకు దారితీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరించింది. సాల్ట్ అధిక వినియోగం మెదడు పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు వాపు ప్రక్రియను ప్రేరేపించి కణాలను అతిగా ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
సాల్ట్ ఎక్కువ తీసుకుంటే బీపీ, హృద్రోగాలు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీసే ప్రమాదం నెలకొంది. సాల్ట్ అధిక వాడకంతో ఒత్తిడి కూడా శరీరాన్ని చిత్తు చేస్తుందని చెబుతున్నారు. ఇక సాల్ట్ స్ధానంలో వెల్లుల్లి, మిరియాలు, అల్లం, నిమ్మరసం వంటి ప్రత్యామ్నాయాలను వాడటం ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.