ఆరోగ్యం కోసం స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం వల్ల ఒకే రకమైన ప్రయోజనం ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరం తన విధులు సక్రమంగా నిర్వర్తించడానికి స్త్రీలకు, పురుషులకు వేర్వేరు పోషకాలున్న ఆహారాలు అవసరం. ఎందుకంటే ఆడ, మగ.. ఎవరి ఆరోగ్య సమస్యలు వారికి ఉంటాయి. శరీర నిర్మాణంలోనూ తేడా ఉంటుంది. పురుషుల కండరాల ద్రవ్యరాశి (మజిల్ మాస్) స్త్రీల కంటే ఎక్కువ. కాబట్టి పురుషులు మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. మహిళలతో పోలిస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న భోజనం అవసరమవుతుంది. మాంసకృత్తులు ఎక్కువ అవసరం కాబట్టి, అవి శరీరంలో కలిసిపోవడానికి కొన్ని అదనపు విటమిన్లు, ఖనిజ లవణాలు ఉన్న పదార్థాలను పళ్లెంలో భాగం చేసుకోవాలి.
మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్ ,Mayuri@trudiet.in