న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పండు ఏదంటే అరటి పండేనని (Health Tips) అందరూ చెబుతుంటారు. ఎన్నో పోషకాలతో నిండిన అరటిపండు ఏడాది పొడవునా లభిస్తుంది. అయితే అరటి పండు ఏ సమయంలో తినాలి..మితంగా తీసుకోవాలా..? మధుమేహులు అరటిపండు తినవచ్చా వంటి ఎన్నో సందేహాలు వెంటాడుతుంటాయి.
జీర్ణక్రియ, జీవక్రియలను మెరుగుపరిచి శరీరానికి అవసరమైన పోషకాలను అందించే అరటిపండును కొన్ని పద్ధతుల్లో అందరూ తీసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లలో అధికంగా చక్కెర ఉండటంతో దీన్ని మధుమేహులు తీసుకోరాదని చెబుతున్నా వీటిని షుగర్ రోగులు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ దెల్నాజ్ చందువాదియా చెబుతున్నారు. నిపుణుల సూచనతో మితంగా అరటిపండును ఎవరైనా తినవచ్చని అంటున్నారు.
మధుమేహంతో బాధపడేవారు వారి గ్లైసెమిక్ నియంత్రణ, చికిత్సకు అనుగుణంగా ఏ సమయంలో, ఎంత మోతాదులో అరటిపండును తీసుకోవచ్చో పోషకాహార నిపుణులు సూచిస్తారని చెప్పుకొచ్చారు. లంచ్, డిన్నర్ సమయంలో అరటి పండ్లను తీసుకోరాదని, లంచ్, డిన్నర్ మధ్య స్నాక్స్ తరహాలో బనానాను తీసుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ స్వీదల్ ట్రినిడాడ్ సూచించారు. మధ్యాహ్న సమయంలో అరటి పండును తింటే మిగిలిన రోజంతా క్యాలరీలను ఖర్చు చేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు.
Read More :