న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలితో పలువురిలో ప్రేవుల ఆరోగ్యం (Health Tips) దెబ్బతిని జీర్ణక్రియ సాఫీగా సాగకపోవడంతో పాటు శరీరం సూక్ష్మపోషకాలు, విటమిన్స్, మినరల్స్ను గ్రహించే శక్తి తగ్గడంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రేవుల్లో ఉండే మంచి, చెడు బ్యాక్టీరియాలను బ్యాలెన్స్ చేసే జీవనశైలిని అనుసరించడంతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ప్రముఖ పోషకాహార నిపుణులు మామి అగర్వాల్ చెబుతున్నారు.
ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారం తీసుకోవడం కీలకమని చెప్పుకొచ్చారు. ప్రేవుల నుంచి విషవ్యర్ధాలను బయటకు పంపి డీటాక్సిఫికేషన్ ప్రేరేపించే ఆహారం తీసుకోవాలని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ మామి అగర్వాల్ ఇటీవల తన ఇన్స్టాగ్రాం పేజ్లో పేర్కొన్నారు. వీలైనంత వరకూ చక్కెర వాడకాన్ని బాగా తగ్గించాలని సూచించారు. రిఫైన్డ్ చక్కెరలు దీర్ఘకాలం వాడితే ప్రేవుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
చక్కెర స్ధానంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను వాడాలని మామి అగర్వాల్ సూచించారు. ప్రాసెస్డ్ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని, వాపు ప్రక్రియకు దారితీసే ఆహారం తీసుకోరాదని చెబుతున్నారు. తాజా పండ్లు, పులిసిన ఆహారం, పెరుగు, ఇడ్లీ, దోశ, ఉల్లి, అల్లం వంటి ఆహార పదార్ధాలకు తీసుకోవాలి. బాదం, బ్లూబెర్రీ, బ్రకోలి వంటి పాలీపెనాల్స్ ఉండే ఆహారం కూడా ప్రేవుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని మామి అగర్వాల్ చెప్పుకొచ్చారు.
Read More :