Ready To Eat Foods : అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారంతో హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, అకాల మరణం సహా ఆరోగ్యంపై 32 రకాల హానికారక ప్రభావాలు ఉంటాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బీఎంజేలో ప్రచురితమైన ఈ అధ్యయనం దాదాపు కోటి మందిపై నిర్వహించిన 45 మెటా అనాలిసిస్ రివ్యూ అనంతరం ఈ వివరాలను తెలిపింది. రెడీ టూ ఈట్, ఇన్స్టంట్ ఫుడ్స్ వంటి అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందని ఈ అధ్యయనం హెచ్చరించింది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఆరోగ్యానికి ముప్పు కలిగించే హానికారక పదార్ధాలు ఉంటాయని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆప్ పబ్లిక్ హెల్త్, యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, సోర్బనే యూనివర్సిటీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోని డీకిన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ సంస్ధలకు చెందిన పరిశోదకులు హెచ్చరించారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకుంటే హృద్రోగాలు, మానసిక సమస్యలతో పాటు అకాల మరణం ముప్పు అధికమని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్యాకేజ్డ్ బేక్డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫిజ్జీ డ్రింక్స్, తీపితో కూడిన సిరిల్స్, రెడీ టు ఈట్ మీల్స్ వంటి అధిక ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో అధిక షుగర్, కొవ్వు, సాల్ట్ ఉండటంతో పాటు విటమిన్స్, ఫైబర్ తక్కువగా ఉంటుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు తీసుకుంటే ఊబకాయం ముప్పు 55 శాతం పెరిగే అవకాశం ఉండగా, నిద్రలేమి తలెత్తే చాన్స్ 41 శాతం, మధుమేహ ముప్పు 40 శాతం, కుంగుబాటు ముప్పు 20 శాతం పెరుగుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు.
Read More :
T-Flight | సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్ను అభివృద్ధి చేసిన చైనా