న్యూఢిల్లీ : వాహనాల రద్దీతో పాటు పండగ సీజన్లలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రమవుతుంది. ముఖ్యంగా దీపావళి వంటి పండగ సమయంలో బాణాసంచా మోతతో కాలుష్యం ఆందోళనకర స్దాయికి చేరుతుంది. బాణాసంచా పేలుళ్లతో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర కాలుష్య కారకాలను గాలిలో విరజిమ్ముతాయి. ఈ కాలుష్య కారకాలు అటు పర్యావరణానికి చేటు చేయడంతో పాటు ఆరోగ్యాలపైనా పెను ప్రభావం చూపుతాయి.
దివాళీ వంటి పర్వదినాల్లో వాయు కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు కొన్ని సూచనలు పాటించాలి. కాలుష్యం తీవ్రంగా ఉండే సమయాల్లో ఇండ్లకే పరిమితం కావాలి. శ్వాస కోశ సమస్యలున్నవారితో పాటు కాలుష్యంతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్ధితి ఉంటే ఆయా సమయాల్లో బయటకు వెళ్లడం మానుకోవాలి. కలుషిత గాలి మీ ఇంట్లోకి చొరబడకుండా డోర్స్ మూసివేయడంతో పాటు అవసరమైతే ఎయిర్ ఫ్యూరిఫైర్స్ ఉపయోగించాలి.
వ్యాయామం కోసం ఆరుబయటకు వెళ్లకుండా ఇంట్లోనే గాలి తగిలే ప్రదేశంలో వ్యాయామం చేయడం మేలు. మంచి నాణ్యతతో కూడిన మాస్క్లు ఉపయోగించాలి. పర్యావరణ అనుకూల బాణాసంచాను వాడటంతో పాటు ప్రజా రవాణా వ్యవస్ధను ఉపయోగించి కార్యాలయాలకు చేరుకోవడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. మీరు నివసించే ప్రాంతాల్లో మొక్కలను పెంచడం విస్తృతంగా చేపట్టడం ద్వారా పచ్చదనం వెల్లివిరిసేలా చూసుకోవాలి.
Read More :
Tea History | సాయంకాలం ఛాయ్కి.. టీవీ సీరియల్స్కు ఉన్న అనుబంధం ఎంత గొప్పదో!