న్యూఢిల్లీ : కరోనా నూతన వేరియంట్ల నుంచి రక్షణ కల్పిస్తూ మెరుగైన ఇమ్యూనిటీ కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్-19 సెకండ్ డోసు తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు తీసుకునేందుకు వ్యవధిని ఆరు నెలలకు కేంద్రం తగ్గించిన నేపధ్యంలో ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ మోదీ బూస్టర్ డోసు ప్రాధాన్యతను వివరించారు.
న్యూ వేరియంట్లను తట్టుకునేలా నూతన వ్యాక్సిన్లు వస్తున్నాయని వీటి ద్వారా కొత్త స్ట్రెయిన్లను దీటుగా నిలువరించగలిగే ఇమ్యూనిటీ పెంపొందుతుందని ఆయన చెబుతున్నారు. సెకండ్ డోసు, బూస్టర్ డోసు మధ్య వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించారని ఈ అవకాశం వినియోగించుకోవాలని డాక్టర్ మోదీ కోరారు.
వ్యాక్సిన్తో పరిమిత ఇమ్యూనిటీ వస్తుందని, బూస్టర్ డోసుతో ఇమ్యూనిటీ మరింత పెరిగి ఇన్ఫెక్షన్ను నియంత్రిస్తుందని చెప్పారు. నూతన వేరియంట్ల నుంచి కూడా బూస్టర్ డోసులు మనకు రక్షణ కల్పిస్తాయని అన్నారు.