నొప్పిని తగ్గిస్తాయనో, హానికర సూక్ష్మజీవులను నాశనం చేస్తాయనో.. రోగులు దీర్ఘకాలం పాటు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. మూత్రపిండ వ్యాధులకు దారితీస్తున్నాయి. కాబట్టి, ఆ తరహా ఔషధాలు అనివార్యం అయినప్పుడు.. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా.. మూత్రపిండ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.
శరీరంలో ప్రధాన వ్యవస్థ.. మూత్ర పిండాలు. రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్త పోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకపోతే కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే. కాబట్టి బీపీ, షుగర్ ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, జీవితకాలం మందులు వాడేవారు, పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్కు అలవాటుపడిన వారు.. తరచూ మూత్ర పిండాల పనితీరును పరీక్షించుకోవడం ఉత్తమం. అందులోనూ, ఈ మధ్యకాలంలో కిడ్నీ వ్యాధులు పెరిగిపోతున్నాయి. డయాలసిస్ రోగుల సంఖ్య కూడా అధికం అవుతున్నది. మనదేశంలో 17 శాతం మందికి కిడ్నీ జబ్బులు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎందుకు వైఫల్యం?
మూత్రపిండాల వైఫల్యానికి తొలికారణం మధుమేహం. రెండో కారణం హైపర్టెన్షన్. మూడో కారణం కిడ్నీలో రాళ్లు. ఇవన్నీ కాకుండా.. విచ్చలవిడిగా మందుల వాడకమూ రోగుల పాలిట గండంగా మారుతున్నది. అందులోనూ పెయిన్ కిల్లర్స్ తొలి ముద్దాయిగా నిలుస్తున్నాయి. బీపీ, షుగర్, క్యాన్సర్, హెచ్ఐవీ, టీబీ, కాలేయ వ్యాధులు, గుండె రుగ్మతలు, థైరాయిడ్, ఆర్థరైటిస్ హైరిస్క్ రుగ్మతల కేటగిరీలోకి వస్తాయి. ఈ వ్యాధి గ్రస్తులు చాలాకాలం పాటు శక్తిమంతమైన మందులు, పెయిన్ కిల్లర్స్, యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. అవన్నీ శరీరంపై దుష్ప్రభావం చూపుతాయి. మూత్రపిండాలనూ దెబ్బతీస్తాయి. కాబట్టి, ఆ పరిధిలోకి వచ్చేవారు కనీసం సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్లు చేయించుకోవాల్సిందే.
రెండురకాల ప్రభావాలు
మూత్రపిండాలపై మందుల ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. అక్యూట్ కిడ్నీ డిసీజ్, సంక్షిప్తంగా ఏకేడీ. రెండోది.. క్రానిక్ కిడ్నీ డిసీజ్. దీన్నే సీకేడీగా వ్యవహరిస్తారు. తరచూ ఏకేడీకి గురయ్యేవారు సీకేడీ దశలోకి వెళ్లిపోయి అంతిమంగా డయాలసిస్ స్థితికి చేరుకుంటారు. సాధారణంగా, తొంభై రోజుల్లోపు కిడ్నీ సమస్యలతో బాధపడే వారిని ఏకేడీ రోగులుగా పరిగణిస్తారు. తొంభై రోజులు దాటితే సీకేడీ రోగుల కింద లెక్క కడతారు.
అక్యూట్ కిడ్నీ డిసీజ్ (ఏకేడీ)
కొన్నిరకాల మందులు వాడుతున్న సమయంలో మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. అలా రోగి మూత్రపిండాల సామర్థ్యం తగ్గిపోయిన మొదటి ఏడు రోజుల కాలాన్నీ ‘అక్యూట్ కిడ్నీ ఇంజురీ’గా పరిగణిస్తారు. ఆ తరువాత నుంచి.. 90 రోజుల లోపు వరకు ‘అక్యూట్ కిడ్నీ డిసీజ్’ అంటారు. మందులు మానేసిన తర్వాత, అక్యూట్ కిడ్నీ డిసీజ్ రోగుల్లో మూత్రపిండాల పనితీరు మళ్లీ మెరుగుపడవచ్చు.
ఈ మందులు విషాలే..
క్రానిక్ కిడ్నీ డిసీజ్(సీకేడీ)
దీర్ఘకాలం నుంచీ కిడ్నీ సమస్యలు ఉన్న రోగి క్రమంగా డయాలసిస్ వైపు వెళ్తాడు. అంటే, మూత్రపిండాల వైఫల్యానికి చేరువ అవుతాడు. మనదేశంలో ఏటా కొత్తగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది డయాలసిస్ దశకు చేరుతున్నారు. వీరిలో సంవత్సరానికి 10 వేల మందికి మాత్రమే మూత్రపిండాల మార్పిడి జరుగుతున్నది. మిగిలిన 4.9 లక్షల మంది డయాలసిస్పైనే ఆధారపడాల్సి వస్తున్నది. దీనికి ప్రధాన కారణం డయాబెటిస్, హైపర్టెన్షన్ తదితర కారణాలతో పాటు విచ్చలవిడిగా పెయిన్
కిల్లర్స్, యాంటిబయాటిక్స్ వాడటం. దీంతో కిడ్నీలు పూర్తిగా దెబ్బతింటాయి. ఆ ఫలితంగా, అక్యూట్ ఆన్ క్రానిక్ కిడ్నీ డిసీజ్కు గురవుతున్నారు. అంటే, పదేండ్ల తర్వాత రావాల్సిన డయాలసిస్ దశ రెండేండ్లకే వచ్చేస్తున్నది.
డయాలసిస్ సంకేతాలివే..
శరీరంలో వ్యర్థ జలాలు పేరుకుపోయి (యూరినిక్ టాక్సిన్స్).. పొటాషియం, ఆమ్లాలు పెరిగిపోయి.. రక్తంలో పోగైన సీరం క్రియాటిన్ శరీరంలోని ఇతర భాగాల పనితీరుమీద దుష్ప్రభావం చూపినప్పుడు.. రక్తంలో విషపూరిత పదార్థాలు అధికమైపోయి, ఆకలి పూర్తిగా మందగించినప్పుడు.. వాటినిడయాలసిస్ సంకేతాలుగా చెప్పవచ్చు.
కిడ్నీల పనితీరు ఆధారంగా..
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మూత్రపిండాల పనితీరు పరీక్షలు చేయించుకోవాలి. ఆ నివేదికల ఆధారంగా నిపుణులు మందుల డోసేజీ నిర్ణయిస్తారు. కిడ్నీలపై చెడు ప్రభావం చూపే మందులను మార్చడమో, డోసేజీ తగ్గించడమో చేస్తారు. అదే సమయంలో..
ప్రధానకారణాలు:
ఏ వ్యాధి విషయంలో అయినా.. చికిత్సలు, శస్త్ర చికిత్సలకంటే.. ముందస్తు జాగ్రత్తలే ఉత్తమం. ప్రతి రుగ్మతకు ముందూ శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. వాటిని అర్థం చేసుకోవాలి. జాగ్రత్తపడాలి. జీవనశైలిని మార్చుకోవాలి. దురలవాట్లను వదిలించుకోవాలి. మూత్రపిండాలకు సంబంధించి.. మూత్ర విసర్జనలో వచ్చే మార్పులను గమనంలోకి తీసుకోవాలి. తరచుగా మూత్ర విసర్జన జరిగినా, మూత్రంలో రక్తం కనిపించినా, మూత్రంలో బుడగలు, నురగలు ఎక్కువైనా, కళ్ల చుట్టూ ఉబ్బు ఏర్పడినా.. ప్రమాద సంకేతాలుగానే అర్థం చేసుకోవాలి. తక్షణం వైద్యులను సంప్రదించాలి. చిట్కాలు, పసరు మందులను ఆశ్రయించడమంటే.. నిండు ప్రాణాలను బలిపెట్టడమే.
డాక్టర్ రాజశేఖర చక్రవర్తి నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ యశోద హాస్పిటల్స్,హైటెక్సిటీ, హైదరాబాద్
…?మహేశ్వర్రావు బండారి