న్యూఢిల్లీ : మన మెదడులో ఆహార పదార్ధాల దృశ్యాలను ఆకలి, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, భావోద్వేగ స్ధితి వంటివి నిర్ధేశిస్తుంటాయి. ఆహారాన్ని మానవ మెదడు గుర్తించే వేగానికి సంబంధించి తాజా పరిశోధన (New Study) కీలక వివరాలు వెల్లడించింది. మన మెదళ్లు ఆహార పదార్ధాలను కేవలం 108 మిల్లీసెకండ్స్లో గుర్తిస్తాయని న్యూ సైంటిస్ట్లో ప్రచురితమైన యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అధ్యయనం తెలిపింది.
ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను ప్రోత్సహించేందుకు ఈ అధ్యయనంలో వెలుగుచూసిన వివరాలు ఉపకరిస్తాయని చెబుతున్నారు. మనం ఫుడ్ను ఎలా ప్రాసెస్ చేస్తామనే విషయంలో శాస్త్రవేత్తలకు కొద్దిగానే తెలుసని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన టామ్ కార్ల్సన్ చెప్పుకొచ్చారు.
ఆహార ఎంపికలో దృష్టి కీలకమైనందున ఇది ఊహించని విషయమని, ఆహార పదార్ధాలను గుర్తించేందుకు మన పూర్వీకులకు చూపు ఆధారమని అన్నారు. అయితే మెదడు కేవలం 108 మిల్లీ సెకండ్స్లో ఆహార పదార్ధాలను గుర్తిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Read More :
Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO