Health Tips : బరువు తగ్గడానికి చాలా మంది రైస్ను వదిలేసి రోటీలు తినడం లేదంటే ఫాస్టింగ్ వంటివి చేస్తుంటారు. కఠిన ఆహార నియమాలు పాటించినా ఆశించిన ఫలితాలు రావడం లేదని నిరాసక్తత వ్యక్తం చేస్తుంటారు. అయితే సంప్రదాయ మన ఆహార పద్ధతులను పాటిస్తూ మన భోజనాన్ని ఆస్వాదిస్తునే సమతూకం పాటించడం ద్వారా బరువు తగ్గడం సహా ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని డైటీషియన్లు సూచిస్తున్నారు.
బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఏం తింటున్నామో దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని న్యూట్రిషనిస్ట్ అపూర్వ అగర్వాల్ చెబుతున్నారు. మన దేశీ ఫుడ్ను సమతూకంతో తీసుకుంటున్నామా లేదా అనేదే ప్రధానమని చెబుతున్నారు.
మనం తీసుకునే ఆహారంలో రైస్, రోటీ, సబ్జి, దాల్, మాంసం, మసాలా దినుసులు, పెరుగు వంటి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో కూడిన సంపూర్ణ ఆహారం దాగుందని అంటారామె. పప్పులో ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు రెండూ ఉండగా, పెరుగులో ప్రొటీన్, కార్బ్స్, కొవ్వు కూడా ఉంటుందని, ఇక రైస్, రోటీ, కూరగాయల్లో ఫైబర్ ఉంటుందని అపూర్వ అగర్వాల్ వివరించారు.
కార్బోహైడ్రేట్ ఆహారం
మనం తీసుకునే ఆహారంలో నాలుగింట ఓ వంతుకు మించి కార్బోహైడ్రేట్లు ఉండకుండా చూసుకోవాలి. పప్పు, రైస్ కలిపి తీసుకుంటే మోతాదు మించకుండా చూసుకోవాలి. నాలుగో వంతుకు మించి కార్బోహైడ్రేట్స్ ఆహారంలో భాగంగా తీసుకోకూడదు.
కూరగాయలు
మనం తీసుకునే ఆహారంలో ఉడికించిన, వండిన కూరగాయలను విధిగా ఉండేలా చూసుకోవాలి. సగం ప్లేట్లో కూరగాయల పోర్షన్ ఉండాలి.
ప్రొటీన్
మన రోజువారీ ఆహారంలో ప్రొటీన్ అత్యంత కీలకం. గుడ్లు, పప్పుధాన్యాలు, పాలు, ఇలా ప్రొటీన్తో కూడిన ఆహారం ప్లేట్ నాలుగో వంతు మించి ఉండకుండా చూసుకోవాలి. ఇక ఆరోగ్యకర కొవ్వులు మనం కూరగాయలు, పప్పును కుక్ చేసేందుకు వాడే నూనెల ద్వారా సమకూరుతాయి. ప్రత్యేకంగా ఫ్యాట్స్ను తీసుకోవడం అవసరం లేదు.
Read More :
Rare Surgery: ఓ పేషెంట్ కడుపులో 39 నాణాలు, 37 అయస్కాంతాలు.. వాటిని ఎందుకు తిన్నాడంటే?