న్యూఢిల్లీ: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ(Rare Surgery) చేశారు. ఓ పేషెంట్ కడుపులో నుంచి 38 నాణాలు, 37 మ్యాగ్నెట్లను సర్జరీ చేసి తీశారు. ఆ రోగి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది. అయితే బాడీ బిల్డింగ్ కోసం అవసరమైన జింక్ పదార్ధాన్ని త్వరగా పొందాలన్న ఉద్దేశంతో ఆ రోగి నాణాలు, మ్యాగ్నెట్లు తిన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు.
ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల వ్యక్తి ఇటీవల తీవ్రమైన వాంతులు, కడుపు నొప్పితో బాధపడ్డాడు. 20 రోజుల నుంచి అవస్థపడుతున్న ఆ వ్యక్తి ఏమీ తినలేకపోయాడు. దీంతో ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు సీటీ స్కాన్ చేయగా అతని కడుపులో నాణాలు, అయస్కాంతాలు ఉన్నట్లు తేల్చారు. చిన్న పేగులో రెండు చోట్ల మ్యాగ్నెట్లు, కాయిన్లు నిలిచిపోయినట్లు సర్జరీలో తేలినట్లు డాక్టర్లు చెప్పారు. దాని వల్ల ఆహారం తీసుకున్నా లోపలికి వెళ్లలేదు.
పేగును కోసి ఆ నాణాలను, మ్యాగ్నెట్లను తీశారు. రూ.1, రూ.2, రూ.5కు చెందిన 39 నాణాలు, రకరకాల ఆకారంలో ఉన్న 37 మ్యాగ్నెట్లు కడుపు నుంచి తీశారు. సర్జరీ తర్వాత ఏడు రోజులకు అతన్ని డిస్చార్జ్ చేశారు. శరీర ధారుఢ్యం కోసం జింక్ అవసరమని, అందుకే మ్యాగ్నెట్లను మింగినట్లు ఆ వ్యక్తి తెలిపాడు. నాణాల్లో జింక్ మూలకం ఉంటుందని, అయితే అది కడుపులో ఎక్కువ సేపు ఉండాలంటే మ్యాగ్నెట్ అవసరమని ఆ వ్యక్తి రెంటిండిని తీసుకున్నాడు.