న్యూఢిల్లీ : అనారోగ్యకర ఆహారం తీసుకోవడం, అదిక ఆహారం, సమయానికి తినకపోవడం వంటి అలవాట్లు అజీర్తి, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. అజీర్ణ సమస్యలు శరీరంలో ఇతర వ్యాధులనూ ప్రేరేపిస్తాయి. అజీర్తితో బాధపడేవారు భోజనం తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో మలబద్ధకం, మొలలు వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
అయితే తేలికపాటి వంటింటి చిట్కాతో ఈ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వేయించిన వామును రాక్ సాల్ట్తో నీళ్లతో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలకు సులభంగా, వేగంగా చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. వాములో ఫైబర్, మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాల్ట్తో కలిపి వాము తీసుకుంటే అజీర్తి, అసిడిటీ నయమవుతాయని చెబుతున్నారు. వాములో ఉండే యాక్టివ్ ఎంజైమ్లు కడుపులోని ఆమ్లాలను మెరుగుపరుస్తాయి. వాములో ఉండే థైమోల్ వంటి ఔషధ గుణాలు డయేరియాను నియంత్రిస్తాయి.
కడుపులోని గ్యాస్ట్రిక్ ఆమ్లాలను థైమోల్ విడుదల చేస్తే అది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా సాయపడుతుంది. వాము, రాక్సాల్ట్ రెండూ శరీరంలోని ఇతర మినరల్స్ను బ్యాలెన్స్ చేయడంలో సహకరిస్తాయి. వాము జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూడటంతో పాటు వంటకాల రుచిని కూడా పెంచుతుంది. ముక్కు దిబ్బడను వదిలించి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పంటి నొప్పి కూడా వాముతో నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటీబయాటిక్ ఔషధ గుణాలతో అర్ధరైటిస్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు ప్రమాదకర కొవ్వులైన ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.