Kidney Day | గర్భధారణ దశలో మహిళల శరీరం ఎన్నో మార్పులకు గురవుతుంది. ఈ సమయంలో తలెత్తే పరిణామాలు వారి మూత్రపిండాలకు తీవ్రమైన ముప్పును కలిగించే ప్రమాదం ఉంది. గర్భధారణ మొదటి, చివరి త్రైమాసికాల్లో (ట్రైమెస్టర్) ఇలా జరిగే అవకాశం ఎక్కువ. సమస్యను తొలిదశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. లేకపోతే తల్లి జీవితం ప్రమాదంలో పడుతుంది. నిజానికి, మూత్రపిండాల సంరక్షణ విషయంలో మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. కిడ్నీ వ్యాధులు మహిళల్లోనే అధికం. కానీ, డయాలసిస్ సౌకర్యం పురుషులకే ఎక్కువగా అందుబాటులో ఉంది. కిడ్నీల మార్పిడి విషయంలో కూడా 75 శాతం సందర్భాలలో మహిళలు దాతలుగా ఉంటున్నారు. అదే స్వీకర్తల విషయానికి వస్తే 25 శాతం కంటే తక్కువ ఉండటం బాధాకరం. ‘కిడ్నీ డే’ సందర్భంగా అయినా ఈ తరహా పక్షపాతాన్ని వదిలించుకోవాలి. ఈ దిశగా ఎంతోకొంత మార్పు మొదలైంది. చాలా ఆస్పత్రులు మహిళల ఆరోగ్యం ప్రాధాన్యాన్ని, ముఖ్యంగా తల్లుల ఆరోగ్యాన్ని గుర్తిస్తున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనే విషయంలో వృత్తిపరమైన సంఘాలు కొత్తకొత్త కార్యక్రమాలను కార్యరూపంలోకి తెస్తున్నాయి. యశోదా హాస్పిటల్ యాజమాన్యం ప్రోత్సాహంతో ‘వుమెన్ ఇన్ నెఫ్రాలజీ- ఇండియా’ ప్రారంభమైంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న 300 మంది నెఫ్రాలజిస్టులు ఉన్నారు. దీనికి అంతర్జాతీయ నెఫ్రాలజీ సొసైటీ నుంచి కూడా సహాయ సహకారాలు అందుతున్నాయి. కుటుంబానికి మహిళ ఎంత ముఖ్యమో, మహిళ మనుగడకు మూత్రపిండాలు అంతే ముఖ్యం. సమాజం ఈ విషయాన్ని గుర్తించగలిగితే చాలు.
– డాక్టర్ ఊర్మిళా ఆనంద్
(వ్యవస్థాపక అధ్యక్షులు వుమెన్ ఇన్ నెఫ్రాలజీ- ఇండియా)
సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్
“కిడ్నీ సమస్యలకూ, శృంగారంలో ఇబ్బందులకు ఏమైనా సంబంధం ఉన్నదా?”
అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం: కిడ్నీలో రాళ్లా? ఈ ఆహారం మానేయండి”
అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? ఈ జాగ్రత్తలు పాటించండి”