న్యూఢిల్లీ : 32 రకాల క్యాన్సర్లను ముందుగానే పసిగట్టే ఏఐ ఆధారిత రక్త పరీక్షను గురుగ్రాంకు చెందిన స్టార్టప్ ప్రెడ్ఒమిక్స్ అభివృద్ధి చేసింది. ఈ వినూత్న బ్లడ్ టెస్ట్తో స్త్రీ, పురుషుల్లో 98 శాతం కచ్చితత్వంతో 32 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. సంస్థ యొక్క ఆంకోవెరిక్స్-ఎఫ్ అనే పేటెంట్ పొందిన సాంకేతికతతో జీవక్రియలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని కలిపి ఒకే పరీక్షలో బహుళ క్యాన్సర్ల యొక్క మెటాబోలైట్ సంకేతాలను గుర్తిస్తుంది.
క్యాన్సర్ను గుర్తించడంలో మెటబాల్మిక్స్ సరైన టెక్నిక్ అని ప్రెడ్ఒమిక్స్ సహ వ్యవస్ధాపకులు, చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ కానూరి వీఎస్. రావు పేర్కొన్నారు. 2022లో ఈ టెస్ట్ను తొలుత లాంఛ్ చేయగా ఒకే బ్లడ్ టెస్ట్తో మహిళల్లో బ్రెస్ట్, ఎండోమెట్రిమ్, సర్విక్స్, ఓవరీ క్యాన్సర్లను గుర్తించింది. ఆపై కంపెనీ ఒకే బ్లడ్ టెస్ట్తో స్త్రీ, పురుషుల్లో 32 రకాల క్యాన్సర్లను పసిగట్టేలా రక్త పరీక్షను విస్తృతం చేసింది.
పాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రైన్ క్యాన్సర్, సార్కోమస్ క్యాన్సర్లతో పాటు భారత్లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్లను కూడా ఈ టెస్ట్ కవర్ చేస్తోంది.
Read More