Eating Food | ఆరోగ్యంగా ఉండటానికి, జీవక్రియ సక్రమంగా కొనసాగడానికి, వ్యాధులను నివారించేందుకు సరైన ఆహారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజుకు మూడుసార్లు తినే ఆచారం ఎన్నో ఏండ్లుగా మనం చూస్తున్నాం. ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం, రాత్రికి భోజనం చేస్తుంటాం. అయితే ఆహారం తీసుకోవడానికి సరైన మార్గం ఏదనేది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆహారం ఎప్పుడు, ఎలా, ఎంత తరచుగా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం అనే విషయాలను తెలుసుకుందాం.
మళ్లీ మళ్లీ తినడం మంచిదేనా..
చాలా మంది రోజులో 3 సార్లు భోజనం మాత్రమే తినాలని బెట్టుతో ఉంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం.. రోజుకు 3 సార్లు తినడం ఆరోగ్యానికి మంచిదని, ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని చాలా మంది నమ్ముతారు. కొందరు తక్కువ మొత్తంలో రోజుకు 4-5 సార్లు తినడానికి ఇష్టపడతారు. తక్కువ వ్యవధిలో రోజుకు 5 – 6 సార్లు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
రోజుకు ఎన్నిసార్లు తినాలి..
శరీరానికి ప్రతి 2-3 గంటలకు కొంత మొత్తంలో ఆహారం అవసరమవుతుంది. అందుకని మధ్యమధ్యలో తినడం చాలా ముఖ్యం. ఒకేసారి తినడానికి బదులుగా చిన్నచిన్న భోజనం తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడమే కాకుండా జీవక్రియ శక్తిని బలపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువ గ్యాప్ ఇవ్వాలి. ఆహారాన్ని ఒకేసారి తినడం కంటే చిన్న భాగాలలో తినడం శ్రేయస్కరం.
సరైన జీర్ణ వ్యవస్థ
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 12 గంటల పాటు ఆహారం తీసుకోకూడదు. దీని వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఈ విషయాన్ని కాలిఫోర్నియాలోని సాల్క్ ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ స్టడీస్కు చెందిన క్లినికల్ పరిశోధకురాలు ఎమిలీ మనోయోజెన్ ఇటీవలి పరిశోధనలో తేల్చారు.
ఉపవాసం మంచిదే..
ఉపవాసం చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ఉపవాసం గ్లైసెమిక్ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ తగ్గడం వల్ల శరీరంలో తక్కువ కొవ్వు పేరుకుపోతుంది. రాత్రి ప్రారంభంలో తినడం వల్ల ఉపవాసం సమయం పెరుగి శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఒక పూట భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుందని వారు చెప్తున్నారు.
రోజువారీ ఆహారంపై శ్రద్ధ