న్యూఢిల్లీ : మధుమేహం ప్రపంచ జనాభాను వేధిస్తున్న జీవన శైలి వ్యాధుల్లో ముందువరుసలో ఉంది. 2021లో మధుమేహానికి సంబంధించిన సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది మృత్యువాతన పడ్డారని మయో క్లినిక్ తెలిపింది. రక్తంలో అధిక చక్కెర శాతం ఉండటం గుండె, కిడ్నీ వ్యాధులు సహా ఇతర తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. పాంక్రియాస్ ఇన్సులిన్ను కొద్దిమోతాదులో లేదా అసలు ప్రొడ్యూస్ చేయలేని పరిస్ధితిలో ఘుగర్ వ్యాధి బాధిస్తుంది.
జీవనశైలి మార్పులు, ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారంతో మధుమేహాన్ని సమర్ధంగా నియంత్రించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పలు ఆరోగ్యకర పానీయాలతో మధుమేహ సమస్యల నుంచి బయటపడవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మధుమేహ నియంత్రణలో ముఖ్యంగా కాకరకాయ రసం అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇది బ్లడ్ షుగర్ను నియంత్రించడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. కాకరకాయ జ్యూస్ ఇన్సులిన్ను చురుగ్గా చేసి దాన్ని కొవ్వుగా మారకుండా చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
అధిక బరువును కూడా ఇది నియంత్రిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ కాకర రసం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చక్కగా అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇక కాకర రసంతో పాటు మేథి వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ స్మూతీలతోనూ మధుమేహాన్ని సమర్ధంగా కట్టడి చేయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.