న్యూఢిల్లీ : మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడే వారికి స్ట్రోక్, గుండె పోటు ముప్పు అధికంగా ఉంటుంది. జీవన శైలి వ్యాధులను అదుపులో ఉంచుకుంటే తీవ్ర అనారోగ్యాల బారినపడకుండా జాగ్రత్త పడవచ్చని ఫోర్టిస్ హాస్పిటల్ న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బాల శర్మ చెబుతున్నారు.
బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు ఆరోగ్యకర ఆహారంతో స్ట్రోక్, గుండె పోటు ముప్పుల నుంచి తప్పించుకోవచ్చని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా గత మూడు నెలలుగా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తెలిపే హెచ్బీఏ1సీ పరీక్ష చేయించుకోవాలని , ఈ టెస్ట్ను ఏడాదికి రెండు నుంచి నాలుగు సార్లు చేయించుకోవాలని చెబుతున్నారు. దీన్ని ఏడు శాతం లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు.
ఇక బీపీని అదుపులో ఉంచుకోవాలని ముఖ్యంగా మధుమేహ రోగులు 140/90లోపు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అలాగే హృద్రోగాలు, స్ట్రోక్కు దారితీసే కొలెస్ట్రాల్ను నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ దిగువన సూచించిన జాగ్రత్తలు పాటిస్తే తీవ్ర అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చని ఆమె చెబుతున్నారు.
బీపీ, షుగర్ నియంత్రణ
కొలెస్ట్రాల్కు చెక్
పండ్లు, కూరగాయలు, ఆకుకూరల వినియోగం
బరువును అదుపులో ఉంచుకోవాలి
మద్యపానం, ధూమపానానికి చెక్
రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం
ఒత్తిడికి దూరం