న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు (covid-19) రోజురోజుకూ గణనీయంగా పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కొవిడ్-19 వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు.
ఈ భేటీలో కొవిడ్-19 పరిస్ధితిపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహిస్తారు. ఇక కొవిడ్ సాధికారిక కార్యనిర్వాహక మండలి బుధవారం కొవిడ్-19పై సమీక్షా సమావేశం నిర్వహించింది. డాక్టర్ వీకే పాల్, డాక్టర్ రాజీవ్ బల్, ఐసీఎంఆర్కు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో దేశంలో కొవిడ్-19 పరిస్ధితి, కేసులు వేగంగా ప్రబలుతుండటంతో ఎలాంటి సన్నాహాలు చేపట్టాలనే దానిపై చర్చించారు.
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మనం అప్రమత్తంగా ఉండాలని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రబలుతోందని, దీనివల్ల ఆస్పత్రుల్లో చేరికలు పెద్దగా పెరగడం లేదని పేర్కొన్నారు. ఇక గత కొద్ది రోజులుగా కొవిడ్-19 రోజువారీ కేసులు గణనీయంగా పెరగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.
Read More