న్యూఢిల్లీ : పోషకాల గనిగా పేరొందిన అరటిపండును (Banana) ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా ఆరగిస్తారు. ఏడాది పొడవునా లభించే అరటి పండు ఆకలిని తీర్చడమే కాదు శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలనూ అందిస్తుంది. అరటి పండును కాయగూరలా వాడటంతో పాటు పలు స్నాక్స్లోనూ వాడతారు. అరటిలో ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకర కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ ఉండటంతో సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన సమతులాహారం ఈ పండు అందిస్తుంది.
అయితే జలుబు, దగ్గుతో బాధపడేవారితో పాటు మధుమేహులకూ అరటి పండు చేటు చేస్తుందని చెబుతారు. అయితే అరటిపండ్లను పూర్తిగా మానేయాలని దాని అర్ధం కాదని, పరిమిత మోతాదులో అరటి పండ్లను తీసుకుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు కొన్ని రకాల ఆహారాలతో కలిపి అరటి పండు తీసుకోవడం మంచిది కాదని పేర్కొంటున్నారు.
ఇక అరటి పండును పాలతో కలిపి తీసుకోరాదు. బనానా ఆమ్లం కాగా, పాలు తీయగా ఉండటంతో ఇది శరీరంలో గందరగోళానికి దారితీసి జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సూర్య భాగ్వతి చెప్పారు. ఈ రెండింటిని కలిపి తింటే ప్రేవుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీంతో జలుబు, దగ్గు, అజీర్తి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ముప్పుందని హెచ్చరించారు. ఇక అరటిపండుతో కలిపి ఏయే ఆహార పదార్ధాలు తీసుకోరాదో చూద్దాం..
బనానా – మిల్క్
బనానా – రెడ్మీట్
బనానా – బ్రెడ్
బనానా- సిట్రస్ ఫ్రూట్స్
Read More :