న్యూఢిల్లీ : భారతీయులకు పండగలంటే (Diwali 2023) పూజలు, ఆధ్యాత్మికతే కాదు నోరూరించే దేశీ వంటకాల ఘుమఘుమలూ ప్రత్యేకమే. ఇష్టమైన వంటకాను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో కలిసి ఆరగించడం కూడా మనం వేడుకగా జరుపుకుంటాం. ఇక దివాళీ అంటే ఆ ఎంజాయ్మెంట్ రెట్టింపు రేంజ్లో ఉంటుంది. అయితే పండగ ఉత్తేజంతో ఇష్టమైన వంటకాలన్నీ అతిగా ఆరగిస్తే కడుపుబ్బరం, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు వెంటాడతాయి.
దివాళీ పార్టీలో తగిన ఆహారం తీసుకోవడం ద్వారా కడుపుబ్బరం, వికారం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలను దరిచేరకుండా నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పండగ సీజన్లో కార్బొనేటెడ్ డ్రింక్స్, స్పైసీ ఫుడ్, బీన్స్, సాల్టీ స్నాక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్లను అతిగా తీసుకోరాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మరికొన్ని ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవడం ద్వారా దివాళీ పార్టీని ఆస్వాదించవచ్చని న్యూట్రిషన్, వెల్నెస్ కన్సల్టెంట్ నేహ సహాయ ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నారు. ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండే పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ప్రొ బయాటిక్ ఫుడ్, హెర్బల్ టీలు తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
RTC Bus | ప్లాట్ఫామ్పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. సీసీటీవీ వీడియో