న్యూఢిల్లీ : వయోభారంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా చర్మం పొడిబారేలా (skin health) చేసి కాంతివిహీనంలా మార్చేస్తుంది. షుగర్, కొవ్వులతో కూడిన ఆహారం తీసుకోవడం కూడా చర్మం నిగారింపు కోల్పోయేలా చేస్తుంది. వయసు పెరిగేకొద్దీ చర్మంపై ముడతలు సహా కాలుష్యం కారణంగా డల్, డ్రై స్కిన్ సమస్యలూ వెంటాడుతుంటాయి. ఇక ఒత్తిడి, జీవనశైలి, ఆందోళన వంటి సమస్యలు చర్మ సంరక్షణపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మేకప్ అతిగా వాడటం, కాలుష్యం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు చర్మం సహజ కాంతిని కోల్పోయేలా చేస్తాయి. ఇక చర్మ సంరక్షణ కోసం సహజ పద్ధతులను ఆశ్రయించి మెరుగైన ఫలితాలు పొందవచ్చని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. ముఖం, శరీరాన్ని ప్రతిరోజూ సరైన రీతిలో శుభ్రపరుచుకోవాలి. శరీరంలో మలినాలు తొలగి మృత కణాలను పునరుద్ధరించేలా జాగ్రత్త తీసుకోవాలి.
నూనె పదార్ధాలు, ప్రాసెస్డ్ ఆహారం, స్వీట్ల వంటి తీపి పదార్ధాలకు దూరంగా ఉండాలి. మాయిశ్చరైజింగ్ క్రీమ్ను మీ శరీర తత్వానికి అనుకూలంగా ఉండేలా ఎంచుకోవాలి. చర్మ సంరక్షణ కోసం సన్స్క్రీన్ లోషన్ను రోజూ వాడాలని చర్మం యవ్వనంతో మెరిసేలా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ అసీం శర్మ సూచిస్తున్నారు.
Read More :