న్యూఢి్లీ : ఢిల్లీలో వాయుకాలుష్యం ధూమపానం కంటే హానికరంగా ఉందని, అధిక కాలుష్యంతో ఢిల్లీవాసుల ఆయుర్ధాయం గణనీయంగా తగ్గిందని ఎయిమ్స్ చీఫ్, ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రణ్దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్యం తీవ్రం కావడంతో కొవిడ్-19 కేసులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. కాలుష్యం వల్ల ఆయుర్ధాయం తగ్గుతుందని, ఢిల్లీ వాసుల ఊపిరితిత్తులు నల్లగా మారాయని అన్నారు. దీపావళి రోజు పటాకులు కాల్చడం కూడా పరిస్దితి దిగజారేందుకు దారితీసిందని పేర్కొన్నారు.
పండగ వేళల్లో వాహనాల రాకపోకలు పెరుగుతాయని ఫలితంగా కాలుష్యం తీవ్రమవుతుందని చెప్పుకొచ్చారు. కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొవిడ్ తీవ్రత అధికంగా ఉంటుందని, రోగుల ఊపిరితిత్తుల్లో మరింత వాపు ఏర్పడవచ్చని ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ అన్నారు. కాలుష్య తీవ్రత కారణంగా ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు తిరిగి వ్యాప్తి చెందవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.