(Mixed Fruits) పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. నిత్యం పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. మన ఆహారంలో తప్పకుండా పండ్లు ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ఏదైన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు తాజా పండ్లను తినాలని చెప్తుండటం మనం చూస్తుంటాం. కారణం పండ్లలో లభించే ఖనిజాలు, విటమిన్లే. ఇంట్లో ఉన్నాయి కదా అని ఓ పండును ఇంకో దానితో కలిపి తింటున్నారా? ఇది చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. ఏఏ పండ్లను కలిపి తినకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బొప్పాయి పండు, నిమ్మకాయలను కలిపి తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ హెచ్చు తగ్గులకు సంబంధించిన సమస్యలు కనిపిస్తాయి. ఇలా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా తలెత్తవచ్చు.
ఆరెంజ్, క్యారెట్ కలిపి తినడం వల్ల మూత్రపిండ సంబంధ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఆరెంజ్, క్యారెట్ కలిపి తినడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు.
జామ, అరటిపండును కూడా కలిపి తినకూడదని సూచిస్తున్నారు. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు వస్తాయంట. అంతేకాదు తలనొప్పి కూడా పెరిగే అవకాశం ఉన్నదంట.
దానిమ్మ, నేరేడు పండ్లు కూడా కలిపి తీసుకోకూడదని నిపుణులు చెప్తున్నారు. ఈ రెండింటిలో చక్కెర, ప్రోటీన్లు అధికంగా ఉండి, కలిపి తీసుకోవడం వల్ల కడుపులో అసిడిటీ, అజీర్ణం, గుండెల్లో మంట పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. వీటిలోని అధిక చక్కెర ప్రోటీన్లు జీర్ణం చేసే ఎంజైమ్లను నశింజేస్తాయట. అలాగే, అరటిపండుతో పాయసం కలిపి తినడం వల్ల శరీరంలో విషపదార్థాలు ఉత్పత్తి అవుతాయని వైద్యులు చెప్తున్నారు.
రెండోరోజు కొనసాగిన రైతుల మహాపాదయాత్ర
గవర్నర్ ఆమోదంతోనే ఉత్తర్వులు, నిర్ణయాలు : మంత్రి బుగ్గన
ఎక్సైజ్ సిబ్బందిపై గిరిజనుల దాడి.. గంజాయి పండిస్తే తప్పేంటని ప్రశ్న
‘విద్యా కానుక’పై సీఎం జగన్ ఆదేశాలు.. విద్యార్ధులకు ఇచ్చేవి ఇవే!
బద్వేల్లో వైసీపీది ప్రజా విజయం : గడికోట శ్రీకాంత్రెడ్డి
చచ్చిన పార్టీ డెడ్ లైన్లు పెట్టడమా? మంత్రి కొడాలి నాని ఫైర్
ప్రభుత్వ దవాఖానల్లో డ్రస్ కోడ్.. మండిపడుతున్న వైద్యులు
అందరికీ అందుబాటులో న్యాయం ఉండాలి: ఉపరాష్ట్రపతి
టీడీపీ గుర్తింపును రద్దు చేయండి : వైసీపీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..