Diabetes | న్యూఢిల్లీ: జీవనశైలి మార్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. శరీరంలోని ప్రతి మెకానిజాన్నీ ఇది గాడి తప్పిస్తుంది. దీన్ని అదుపులో పెట్టేందుకు ఆయుర్వేద వైద్యం నుంచి అల్లోపతి వరకు అన్నీ ప్రయత్నిస్తున్నవారూ ఉన్నారు. అయితే, ఈ మందులన్నింటికంటే డయాబెటిస్ బాధితులకు శుభ్రమైన తాగునీరే దివ్వౌషధమని నిపుణులు బలంగా వాదిస్తున్నారు. తరుచూ నీరు తాగటంవల్ల శరీరంలో అవసరానికి మించి ఉండే గ్లూకోజ్ (చక్కెర)ను మూత్రపిండాలు మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. ఇలా శరీరంలో చక్కెర స్థాయిలు భారీగా పెరగకుండా నీరు కాపాడుతుందని వైద్యులు చెప్తున్నారు. వేసవికాలంలో త్వరగా డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉన్నందున డయాబెటిక్ బాధితులు మరింత జాగ్రత్తగా ఉండి సాధారణంకంటే ఎక్కువ మోతాదులో నీరు తాగాలని సూచిస్తున్నారు.
తాగాలిడయాబెటిస్ బాధితులు భోజనం చేసే ప్రతిసారి ముందుగా నీళ్లు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ హోటల్కు వెళ్లినా ముందుగా నీరు అడిగి తీసుకొని తాగిన తర్వాతే భోజనం చేయాలని అంటున్నారు. అల్పాహారం తీసుకొనే సమయంలో దానితోపాటే నీరు తాగాలి. ఇలా ఎక్కవ సార్లు, ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
రోజూ తీసుకొనే ఆహారంలో నీటిశాతం అధికంగా ఉండే టొమాటోలు, పుచ్చకాయల వంటి పదార్థాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల నీటితోపాటు అవసరమైన ఫ్లూయిడ్లు కూడా శరీరానికి అందుతాయి.
డయాబెటిస్ బాధితులు నిత్యం తమవెంట నీళ్ల బాటిల్ను ఉంచుకోవాలి. ప్లాస్టిక్ బాటిల్ కాకుండా రీయూజబుల్ బాటిల్ అయితే మరీ మంచిది. బయటకు వెళ్లినప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా సమీపంలోనే నీళ్ల బాటిల్ పెట్టుకోవాలి. అప్పుడు తరుచూ నీళ్లు తాగేందుకు అవకాశం ఉంటుంది.
చాలామంది పనిలో పడి నీళ్లు తాగటం మర్చిపోతారు. అలాంటివారు ఫోన్లలో, స్మార్ట్ వాచీల్లో రిమైండర్లు పెట్టుకోవాలి. గంటకో, అరగంటకో గుర్తుచేసేలా రిమైండర్లు పెట్టుకొని నీళ్లు తాగాలి.
తరుచూ సాధారణ నీరు తాగటం చిరాకు అనిపిస్తే అందులో నిమ్మకాయ, దోసకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్ల ముక్కలను కలుపుకొని తాగాలి. అప్పుడు అధికమొత్తంలో నీరు తాగేందుకు వీలు కలుగుతుంది.
బాధితులు శరీరంలో నీటి శాతం ఎంత ఉన్నదో అప్పుడప్పుడైనా తెలుసుకోవటం చాలా ముఖ్యం. దీనివల్ల డీహైడ్రేషన్కు గురికాకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం అనేక మొబైల్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.