న్యూఢిల్లీ : ఆధునిక జీవనశైలితో ప్రపంచవ్యాప్తంగా పలువురు మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహాన్ని మందులతో పాటు ఆహారంతో మెరుగ్గా మెయింటైన్ చేయవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తక్కవ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారంతో పాటు, ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు, సరైన కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు చక్కెరకు దూరంగా ఉండాలి.
మన ఆహారంలో కొన్ని అద్భుతమైన వంటకాలున్నాయని, అవి రుచికరంగా ఉండటంతో పాటు కొద్దిగా తీసుకుంటేనే కడుపు నిండిన భావన కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆహార పదార్ధాలతో జీవక్రియల వేగం పెరిగి మధుమేహ స్ధాయిలు ఆటుపోట్లకు గురవకుండా క్రమబద్ధీకరిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే పోహాలో కార్పోహైడ్రేట్లు తక్కువగా ఉంటూ వేరుశనగలు, కూరగాయల ముక్కలతో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వీటితో పాటు శనగపిండి, కూరగాయలతో కలిపి చేసే వంటకాలు షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రొటీన్లు, ఫ్యాట్స్ పుష్కలంగా ఉండే బాయిల్డ్ ఎగ్స్ మధుమేహులకు అద్భుత ఆహారంగా చెబుతారు. ఫిట్నెస్ ప్రియులు, బరువు తగ్గాలనుకునేవారు కూడా బాయిల్డ్ ఎగ్స్ను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. పన్నీర్ భుర్జీని మధుమేహులు ట్రై చేయవచ్చు. బ్రేక్ఫాస్ట్గా ఈ డిష్ను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించవచ్చు.