న్యూఢిల్లీ : అర్ధరైటిస్పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్ 12న వరల్డ్ అర్ధరైటిస్ డేను (World Arthritis Day 2023) జరుపుకుంటారు. కీళ్ల వాతంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బాధపడుతున్నారు. అర్ధరైటిస్ను ముందుగానే పసిగట్టి చికిత్స తీసుకుంటే ఇబ్బందికర పరిస్ధితులను అధిగమించవచ్చనే దిశగా ప్రపంచ అర్ధరైటిస్ దినం సందర్భంగా ప్రచార పర్వం సాగిస్తున్నారు.
మందులు, ఫిజియోథెరఫీ, జీవనశైలి మార్పులతో అర్దరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కీళ్ల నొప్పులు సహా కండరాల నొప్పులు వంటి వివిధ అనారోగ్యాలకు దేశంలో దశాబ్ధాలుగా ఆయుర్వేద మూలికలను వాడుతున్నారు. వీటిలో కొన్ని మూలికలు ఎముకల బలోపేతానికి ఉపకరించి అర్దరైటిస్ వంటి వ్యాధుల బారినపడకుండా సమర్ధంగా పనిచేస్తాయి.
అర్ధరైటిస్పై ఆయుర్వేద మూలికల ప్రభావంపై శాస్త్రీయ ఆధారాలు పరిమితంగానే ఉన్నా అర్ధరైటిస్తో తలెత్తే నొప్పి, వాపు వంటి సమస్యలను ఈ మూలికల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జెసిక్ వంటి ఔషధ గుణాలతో తగ్గించవచ్చని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అర్ధరైటిస్ లక్షణాల నుంచి బయటపడేందుకు ఈ మూలికలను ఏదో ఓ రూపంలో తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అల్లం, పసుపు, అశ్వగంధ, త్రిఫల చూర్ణం వంటి హెర్బ్స్ ప్రభావవంతంగా పనిచేస్తాయి.
Read More :
Watch: పెట్రోల్ బంక్ సిబ్బందిని గన్తో బెదిరించి దోచుకున్న దుండగులు