సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు మెండు అని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో లభించే శీతాఫలాల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మనకు శక్తితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తాయని చెబుతున్నారు. ఈ పండులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు మెదడును ఉత్తేజితం చేస్తాయి. శీతాఫలంలో పుష్కలంగా లభించే ఫైబర్తో జీర్ణప్రక్రియ సాఫళీగా సాగుతూ ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్ లుటెన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతూ కంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇక సీతాఫలంలో పుష్కలంగా ఉండే మాగ్నీషియం, పొటాషియం ఇతర పోషకాలు రక్తపోటు స్ధాయిని మెరుగ్గా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్యకరమైన మధుమేహ లెవెల్స్ ఉండేలా చేస్తాయి. వాపు వల్ల వచ్చే వ్యాధులను నియంత్రించడంతో పాటు ఇవి గుండె ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయని నిపుణులు చెబుతారు. ఈ పండులో ఉండే విటమిన్ సీ ద్వారా రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుందని, ఇది లో గ్లైసిమెక్ ఇండెక్స్ను కలిగి ఉండటంతో మధుమేహ రోగులూ శీతాఫలం తినవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.