తెలంగాణలో మేధావులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులకు కొదువలేదు. కానీ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగునా వారు వివక్షకు గురయ్యారు. అత్యద్భుతమైన సాహిత్యం సృజించి, అనేకానేక పరిశోధనలు చేసిన కవులు, రచయితలు ఉన్నప్పటికీ వారెవరూ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వారిని స్మరించుకోవటం, వారి సాహిత్య కృషిని భవిష్యత్ తరాలకు అందించటం మన బాధ్యత. అంతేకాకుండా వివిధ రకాల పోటీ పరీక్షల్లో కూడా తెలంగాణ ప్రాంత కవులు, వారి రచనల గురించి ప్రశ్నలు అగుడుతున్నందున నిపుణ పాఠకుల కోసం కొంతమంది మన కవుల విశేషాలు..
ఈయన 1938లో నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల వారి సాహితీ కుసుమాలలో ఈయన కవితలు అచ్చయ్యాయి. ఇవి చైతన్య ప్రతీకలు. 1938లో సాహితీ చైతన్య కళాస్రవంతి అనే సంస్థను స్థాపించారు. తొలిమెట్టు కూడా వీరి సంకలనమే.
ఈయన దేవరకొండలో 1902లో జన్మించారు. 20కి పైగా రచనలు చేశారు. విప్లవ స్వరాలు చెప్పుకోదగినది. నీలా జంగయ్య మిత్రుడు. తెలంగాణలో సంస్కృతాంధ్ర సాహిత్యంలో మంచి ప్రతిభ కలిగిన ముస్లిం కవుల్లో అజ్మతుల్లా, సయ్యదలీ సోదర ద్వయం ఒకటి. గోల్కొండ కవుల సంచికలో వీరి పద్యాలు కలవు (184వ పుట).
1932 జూలై 25న నల్లగొండ జిల్లా సిరికొండ గ్రామంలో జన్మించారు. ఎంఏ, ఎంవోఎల్ చదివారు. ఈయన రచనలు 1) కవితాపట్టాభిషక్తులు 2) వ్యాస భారతి- 1, 2 3) రాచకొండ చరిత్ర 4) రెడ్డిరాజ్య చరిత్రం 5) ఓరుగంటి చరిత్ర 6) కావ్యావతారికలు 7) కాకతీయ చరిత్రం 8) తెలుగుదేశ సాంఘిక చరిత్ర 9) చారిత్రక బాంధవ్యాలు 10) విజయనగర చరిత్రం 11) తెలుగు మహాచరిత్ర మొదలైనవి. భారతి, ఆంధ్రభూమి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.
బాల్యం నుంచే ఉద్యమస్ఫూర్తిగల ఈయన సంస్కృతాంధ్ర సాహిత్యాలను బాగా అధ్యయనం చేశారు. అంతేగాక విమర్శనాత్మక దృక్పథం, చారిత్ర పరిశోధనాపటిమ కూడా ఈయనకు ఉంది. నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు, బీఎన్ శాస్త్రిలతో కలిసి చారిత్రక అంశాలు చర్చిస్తూ ఎన్నో చారిత్రక ప్రదేశాలు సందర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ గర్వించదగ్గ చరిత్ర పరిశోధకుల్లో ఒకరు. నటుడు, కవి, ఉపాధ్యాయుడు, ఉద్యమనేత, చరిత్రపరిశోధకులు, స్వాతంత్య్రసమరయోధుడు, సంగీతజ్ఞుడు.
మునగాల మండలం రేపాలలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో కోదాటి నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈయన జనతాకళ మండలి నాటక సంస్థలో ఒక మూలస్తంభం. కేఎల్ఎన్ రావు నటించిన గెలుపునీదే నాటకంలో నటించారు. పీవీ నర్సింహారావు ఎదుటనే విమర్శించగల సత్తా ఉన్న వ్యక్తి. మల్లంపల్లి సోమశేఖరశర్మ రచించిన రెడ్డి రాజ్యాల చరిత్ర నేడు దొరకకపోయినా ఈయన రాసిన రెడ్డిరాజ్య చరిత్ర ఆ కొరత తీరుస్తుంది. 1976లో పదవీ విరమణ పొందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.
1913లో నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో జన్మించారు. సంస్కృతాంధ్ర, సంగీత, వైద్యవిద్యలు తెలుసు. వీరి రచనలు 1) పద్మినీ ప్రభాకరీయం 2) భగవద్గీతానువాదం. ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి 1945-46లో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అరెస్టయి భువనగిరి జైలులో నిర్బంధశిక్షను అనుభవించారు. మొదట కమ్యూనిస్టు తరువాత సోషలిస్ట్ పార్టీలో చేరారు.
ఈయన కాలం 1900-50. నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. ఈయన భావకవి. అమృతగీతాలు ఈయన రచన. ఈయనకు అనేక ఉద్యమాలతో సంబంధం ఉంది (గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం). జమీందారులకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. మంచి న్యాయవాది. మునగాల రాజా నాయని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా భూమి వ్యవహారాల్లో ప్రజల పక్షాన వాదించిన ధీశాలి. పోలీస్ యాక్షన్కు ముందు అనేకసార్లు జైలుకెళ్లారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కోదాటి నారాయణరావులతో ఈయనకు సాంగత్యం ఉంది. 1920లో పిల్లలమర్రిలో బేతిరెడ్డి గ్రంథాలయాన్ని స్థాపించారు.
ఈయన కాలం 1875-1960. దేవరకొండలో జన్మించారు. సంస్కృతాంధ్ర ఉర్దూ సాహిత్యాలు తెలుసు. 20కి పైగా రచనలు చేశారు. గోల్కొండ కవుల సంచికలో వీరి పద్యాలు అచ్చయ్యాయి. ఈయన రచనలు ఆనందగురుగీత, సురభాండేశ్వరం, తార్క్యోపాఖ్యానం, మానసిక రాజయోగం, బభ్రువాహన, ధ్రువ, నగర, ముక్తి ప్రదాయిని, భీమవర మహాత్మ్యం, నలచక్రవర్తి, నవీన సత్యహరిశ్చంద్ర, హరిప్రియ, దిగంబర మోహిని, ప్రమీల, కాళింది, సిరిసెనగండ్లనల నాటకం, జలంధరాసురవధ, సీతారామ శతకం, సత్యద్రౌపదీసంవాదం.
-30 ఏండ్లు ఆయుర్వేద శాస్త్రంపై పరిశోధన, 23 గ్రంథాలను అచ్చువేసి 20 ఏండ్లుగా సాహిత్యసేవ చేస్తున్నారు. 2016, సెప్టెంబర్ 3న కలకత్తాలో యూనివర్సల్ ట్రేడ్ ఫౌండేషన్ అవార్డు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. ఇటీవల ఈయన పరిశోధనలో తాళపత్రగ్రంథాల్లో లభ్యమైన బ్రహ్మం గారి కన్నా ముందే భవిష్యత్ దర్శనం అనే గ్రంథం కురేషుడు రచించినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కల్యాణి చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయుల కాలంలో అనేక దేవాలయాలు, పట్టణాలు, నగరాలు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.