మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ సహకరించాలి
30 రోజూల్లో ‘మిషన్’ పనులు పూర్తి చేయాలి
అక్రమ లే అవుట్లను తొలగించాలి
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కోస్గి, ఏప్రిల్ 8 : బల్దియా అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నా రు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిప ల్ చైర్పర్సన్ శిరీష అధ్యక్షతన గురువారం బడ్జెట్ సమావే శం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథి గా హాజరన్నారు. మున్సిపల్ బడ్జెట్ ఏడాది కాలానికి అవసరాన్ని బట్టి అంచనా వ్యయం రూ. 24 కోట్ల 66 లక్షల 1 6 వేలు కేటాయించారు. ఇంత బడ్జెట్ ఎలా కేటాయిస్తారని పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించగా ఎమ్మెల్యే నిధులు ఎలా వస్తాయి అనే అంశాన్ని వివరించారు. అనంతరం బల్దియా లో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని వాటిపై తక్షణ మే తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్లు కో రారు. అందుకు అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమాధానమి స్తూ నూతనంగా డీటీసీపీ లేకుండా ఎలాంటి వెంచర్లకు అ నుమతులు లేవన్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెంచర్లు అయితే 10శాతం మున్సిపాలిటీకి స్థలాన్ని కేటాయిస్తేనే ఆ న్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అనుమతులిస్తామని, లే కుంటే అనుమతులు లేవన్నారు. పలు కాలనీల్లో ఉన్న పాత నివాసాలు తాతలు, తండ్రుల పేరిట ఉన్నాయని, వాటికి డెత్ సర్టిఫికెట్ గాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గాని లేవన్నా రు. గతంలో గ్రామ పంచాయతీ ఇచ్చిన యజమాని ధ్రువీకరణ ప త్రాలు, పన్నుల చెల్లింపు కాగితా లు ఉన్నాయని వాటి పేరు మా ర్పిడి చేయాలని కౌన్సిలర్లు కోరడంతో ఈ విషయాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లతో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని అదనపు కలెక్టర్ తెలిపారు.
‘భగీరథ’ పనులు పూర్తి కావాలి
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నెల రోజూల్లో మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో మిషన్ భగీరథ పైప్లైన్పనులు పూర్తి చేయాలని ఏడీ వెంకట్రెడ్డిని ఎమ్మె ల్యే ఆదేశించారు. భగీరథ నల్లా లేని ఇల్లు ఒక్కటి కూడా కనిపించరాదన్నారు. ప్రతి కాలనీ తిరిగి పర్యవేక్షిస్తానని ఎ మ్మెల్యే అన్నారు. అందుకు కావాల్సిన సామగ్రి ప్రభుత్వం నుంచి ఎంత కావాలన్న ఈఎన్సీతో మాట్లాడి ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రోడ్డు విస్తరణ పనులకు అనుమతులు
మున్సిపాలిటీ నలు దిక్కుల డబుల్ రోడ్డు నిర్మాణం ప నులు చేపడుతామని, పట్టణం నుంచి వెళ్లే మహబూబ్నగ ర్ చించోళి నేషనల్ హైవే నాలుగు లైన్లుగా మారనుందన్నా రు. అదేవిధంగా రామాలయం నుంచి సయ్యద్ పహాడ్ వరకు డబుల్ రోడ్డు విస్తరణకు ప్రభుత్వం నుంచి అనుమ తి లభించిందన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నా రు. అదేవిధంగా కోస్గి, నారాయణపేట రోడ్డులో కిలో మీ టర్ మేరకు సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుడు, అధికారులు పాల్గొన్నారు.
జీవనోపాధి కల్పించడం అభినందనీయం
మహిళలకు జీవనోపాధి కల్పించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలో ‘అమ్మ ఆదరణ’ స్వ చ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు స్టిచ్చింగ్, కుట్టుమిషన్ నే ర్పించి సర్టిఫికెట్లను అందజేశారు. ఎమ్మెల్యే సంస్థ నిర్వాహకురాలు సునీతను అభినందించారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం చాలా సంతోషకరమని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నా రు. అనంతరం ఎమ్మెల్యే 50 మందికి సర్టిఫికెట్లు అందజే శారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, వైస్ చైర్పర్సన్ అన్నపూర్ణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.