కృష్ణ, సెప్టెంబర్ 29: పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు 30శాతం పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయించడంపట్ల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచులు, ఎంపీటీసీల గౌరవ వేతనం రూ.5వేల నుంచి 6.500కు, జెడ్పీటీసీ, ఎంపీపీ గౌరవ వేతనం రూ.10వేల నుంచి రూ.13 వేలకు పెంచారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని క్షీరలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో బుధవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటాని క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమాపాటిల్, జెడ్పీటీసీ అంజనమ్మపాటిల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్పాటిల్, పార్టీ ప్రధాన కార్యదర్శి మోనేశ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, సర్పంచ్ రాధ, నాయకులు శివరాజ్పాటిల్, అబ్దుల్ఖాదీర్, మహదేవ్, శంకర్నాయక్, వెంకటేశ్, కృష్ణ పాల్గొన్నారు.
ఎంనోన్పల్లిలో..
ధన్వాడ, సెప్టెంబర్ 29: ధన్వాడ మండలం ఎంనోన్పల్లి గ్రామంలో బుధవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, సర్పంచ్ భారతి, ఎంపీటీసీ సుదీర్కుమార్, సచిన్తో పాటుగా పలువురు పాల్గొన్నారు