గద్వాల న్యూటౌన్, జూన్ 23 : పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ రంజన్ రతన్కుమార్ సూచించారు. నూతనంగా జిల్లాకు వచ్చిన ప్రొహిబిషనరీ ఎస్సైలకు బుధవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఈ-చలాన్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు, శాంతిభద్రతల పరిరక్షణ తదితర వాటిపై ఆవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సేవే పరమావధిగా పని చేయాలన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలన్నారు. ప్రజలందరికీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం కల్పించాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ప్రేమ్కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సూర్యానాయక్, ప్రొహిబిషనరీ ఎస్సైలు పాల్గొన్నారు.