ముంబై, ఏప్రిల్ 24: ప్రముఖ ఆభరణాల సంస్థ రిలయన్స్ జ్యువెల్స్..అక్షయ తృతీయ సందర్భంగా వింధ్య కలెక్షన్లను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో సునీల్ నాయక్ మాట్లాడుతూ.. దేశంలో వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పండుగలా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ అక్షయ తృతీయ రోజున వింధ్య కలెక్షన్లు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆభరణాల కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ అనువైన సందర్భమని, ఇది సంపద, శ్రేయస్సుకు ప్రతీకని వ్యాఖ్యానించారు.