రెండేండ్లుగా కరోనా బారిన పడని గిరిజనులు
కట్టడి కోసం అన్ని చర్యలు
ఇంట్లోనూ, బయట మాస్క్లు, భౌతికదూరం పాటిస్తున్న గిరిజన కుటుంబాలు
530 మంది గిరిజనులు, 250 ఓటర్లు
తండాకు కూతవేటు దూరంలోనే మెదక్ ఎమ్మెల్యే స్వగ్రామం కోనాపూర్ పంచాయతీ
జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్న తండావాసులు
రామాయంపేట, మే 9 :
కరోనా మహమ్మారి రాష్ట్రమే కాకుండా దేశాన్ని, ప్రపంచాన్నే గడగడలాడిసున్నది. ఈ తరుణంలో ఆ గిరిజనతండాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదంటే అతిశయోక్తి కాదు. రెండేండ్ల కాలంగా ఆ గిరిజన ప్రజలు మాస్క్లు లేనిదే బయటకు రారు. ఒకవేళ ఇల్లు విడిచి వచ్చినా బావి దగ్గరకు, లేకుంటే కూలీ పనికి వెళ్లడమే వారి పని. తండాలో 160 కుటుంబాల్లో 530 మంది నివసిస్తున్నారు. అందులో 250 మంది ఓటర్లు ఉన్నారు. తండాలో ఎవ్వరు కూడా అన్నం, కూరగాయలు తప్పా ఇతర ఏ అలవాట్ల జోలికి వెళ్లరు. కోడిగుడ్లే వారి పౌష్టికాహారంగా తీసుకుంటారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడంటారా? మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండా. ఈ తండాలో అందరూ ఒకే మాటమీద నిలబడే రకం. తండా కట్టుబాట్లను దాటి ఎవ్వరు కూడా బయటకు వెళ్లరు. తెల్లవారు లేచింది మొదలు వారిపని వారి పనేదో వారు చేసుకుంటారు. ఆ గిరిజనతండాకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి స్వగ్రామం కోనాపూర్ గ్రామ పంచాయతీ కావడం మరో విశేషం.
తండా చుట్టూరా పంటపొలాలు..
గిరిజన తండా చుట్టూరా పచ్చటి పంట పొలాలు ఉండడం వారి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. తండాకు కూతవేటు దూరంలోనే పంచాయతీ కోనాపూర్ గ్రామం. గ్రామానికి కూడా కరోనా వల్ల సరిగ్గా వెళ్లరు. ఒకవేళ వెళ్తే మరేం తిప్పలోనని ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంట్లోకి రావాలనేది వారి కట్టుబాటు.
ఇంట్లో కూడా మాస్క్లు
మేము ఇంట్లో ఉన్నంతసేపు కూడా మాస్క్ ధరిస్తాం. మాస్క్లను అన్నం తినేటప్పుడు తప్పా పడుకున్నా కూడా మాస్క్ను మా ముఖాలకు పెట్టుకునే పడుకుంటాం. బయట చూస్తే ఒక్కొక్కరికి రెండుసార్లు కరోనా వచ్చిందంటున్నరు. మా తండాలో మాత్రం కరోనా అంటేనే తెల్వదు.
జాగ్రత్తగా ఉంటారు..
గిరిజనతండా వాసులు పక్కా నిబంధనలతో ఉన్నారు. కోనాపూర్కి ఏదైనా పనిమీద వచ్చినా వారి పనులు చేసుకుని వెంటనే వెళ్లిపోతారు. ఎక్కడ కూడా కూర్చోమంటే కూడా కూర్చోరు. వారిపని వారు చేసుకుని తిరిగి తండాకు వెళ్లిపోతారు. ఎప్పటికప్పుడు భౌతికదూరంతో పాటు మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తండాను పరిశుభ్రంగా ఉంచుతున్నాం.
కోనాపూర్ గిరిజన తండాలో పారిశుధ్య కార్మికులతో ఎప్పటికప్పుడు మురికి కాల్వలను శుభ్రంగా ఉంచుతున్నాం. పారిశుధ్య కార్మికులతోని తండాలోని వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చేసి శానిటైజ్ చేస్తున్నాం. గిరిజన తండా వాసులు వారి తండాలోనే తప్పా మరెక్కడికి వెళ్లరు. ఒక్కవేళ వెళ్తే వ్యవసాయ బావుల వద్దకు వెళ్తారు అంతే.