హైదరాబాద్ : ఆకెళ్ల రాఘవేంద్ర రచించిన ‘పాట షికారుకొచ్చింది’ (Pata shikaru kochindhi)పుస్తక పరిచయ కార్యక్రమాన్ని(Book launched) శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్(Singapore) వారి ఆధ్వర్యంలో ఒన్కాన్ బెర్రా ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రచయిత రాఘవేంద్ర మాట్లాడుతూ.. పాట షికారుకొచ్చింది పుస్తకం తన గురువు అయిన సీతారామ శాస్త్రి పాటలను, జీవితాన్ని సమతుల్యం చేసుకుంటూ రాసిందని చెప్పారు.
ప్రతి పాట వెనుక ఉన్న కథను అందరికీ చేరవెయ్యాలనే ఉద్దేశంతో ప్రాణం పెట్టి రాసిన పుస్తకమని తెలిపారు. ఈ సందర్భంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షుడు రత్నకుమార్ కవుటూరు, రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది లింక్లో చూడవచ్చని నిర్వాహకులు తెలిపారు. https://www.youtube.com/live/5tOUHWGrcVs?si=XE_mD-gGaPXKAiz1