PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానికి ప్రధానిగా ఉంటూ తెలంగాణకు ఏదైనా చేయాలనుకుంటే ఎంతైనా చేయవచ్చు. తెలంగాణ అభివృద్ధికి అనేక విధాలుగా తోడ్పడవచ్చు. కానీ ఏ ఒక్కటైనా చేస్తున్నారా? నిధులు ఇవ్వడం ఒక్కటే కాదు, నిధులతో సంబంధం లేని విధాన నిర్ణయాలు ఎన్నో తీసుకోవచ్చు. కానీ తీసుకుంటున్నారా? ఏదో వచ్చే పాయె అనుకోవడం తప్ప, చేస్తున్నదేమీ లేదు.
ప్రధాని మోదీ హైదరాబాద్కు వస్తు న్నారు. ఈ సందర్భంగా కొన్ని ప్రా రంభోత్సవాలు వగైరాలు చేస్తున్నారు. ఇవేమీ చెప్పుకోదగినవి కాదు. పాత వాటికే కొత్త మె రుగులు దిద్దడం తప్ప తెలంగాణ సమాజానికి ఉపయోగపడే పనులు ఒక్కటీ చేయడం లేదు. కనీసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనైనా ఏదో ఒకటి చేస్తారు కొందరు నాయకులు. బీజేపీ వారికి అటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు లేదు. ‘ఏమీ చేయం, కానీ ప్రచారం చేసుకుం టాం. నమ్మి మోసపోండి’ అన్నట్టుగా ఉన్నది బీజేపీ వైఖరి.
ప్రధాని వచ్చి చేసే పనులు చూస్తే నవ్వు రా కమానదు.ఎంఎంటీఎస్ నిజాం కాలంనాటిది. దీనిపై కొన్ని రైళ్ళను ప్రవేశపెట్టడానికి ప్రధాని వచ్చి ప్రారంభించాలా? ప్రపంచీకరణ తర్వా త దేశమంతా మౌలికవసతులు ఏర్పాటవుతున్నాయి. ఈశాన్య రాష్ర్టాలు కూడా ఇందుకు మి నహాయింపు కాదు. అటువంటిది దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణలో డబ్లింగ్ పనులు చేపట్టడానికి ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. ఆలస్యంగానైనా, తప్పనిసరి పరిస్థితుల్లో డబ్లింగ్ పనులు చేశారు.అది కూడా మోదీకి గొప్పగానే కనిపిస్తున్నది. కొత్తగా రైలు మార్గం వేయడం కూడా కాదు. కేవలం డబ్లింగ్ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని రావడమే గొప్పగా అనిపిస్తున్నది మన బీజేపీ నాయకులకు. దేశంలో కీలక స్థానంలో ఉన్న తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం తప్పనిసరి. అయినా వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నది కేంద్రం. తెలంగాణ పట్ల కక్షసాధింపుతో వ్యవహరిస్తున్నది. జాతీయ రహదారుల ప్రాజెక్టులు మంజూరై ఏండ్లు గడుస్తున్నా టెండర్ల ప్రక్రియ ప్రారంభించరు. భూ సేకరణకు నిధులివ్వరు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఎన్హెచ్-44 లోని ఆరాంఘర్ – శంషాబాద్ రహదారి, ఎన్హెచ్-169లోని ఎలివేటెడ్ కారిడార్లకే ఇప్పటి వరకు దిక్కులేదు. బీజేపీ నాయకులకు హైదరాబాద్ నగరం ఓట్లు కావాలే తప్ప ప్రజల సౌకర్యాలు పట్టవనడానికి ఇదొక ఉదాహరణ. ఇప్పటి వరకు రాష్ర్టానికి చెందిన ఐదు జాతీయ రహదారులకు టెండర్ల ప్రక్రియను కేంద్రం పెండింగ్లో పెట్టిం ది. చేయవలసిన పనులు చేయకుండా ప్రధా ని మోదీ రాష్ర్టానికి వచ్చి చేసేదేమిటి? పైగా ఇప్పటికే అరకొరగా ఉన్న రహదారులను జాతీయ రహదారుల పేర వృద్ధి చేస్తామనడం కూడా గొప్పగా చెప్పుకునే దీన స్థితిలో బీజేపీ పాలకులు ఉన్నారు. పాత ఇంటికి సున్నం వేసి, ఏకంగా ఇల్లు కట్టించినంత గొప్పలు చెప్పుకోవడం మాదిరిగా ఉన్నది వారి విధా నం. అన్నిటి కన్నా ఆశ్చర్యకరమైన విషయం వందే భారత్ రైళ్ళు. మన దేశంలో రైళ్ళు కాలానుగుణంగా మెరుగుపడుతూ వస్తున్నాయి. 1990 దశకం నుంచి ఇటువంటి మెరుగుదల క్రమబద్ధంగా సాగుతున్న క్రమంలో శతాబ్ది రైళ్ళు కూడా వచ్చాయి. మరింత మెరుగు పరిచినవే వందే భారత్ రైళ్ళు. ఇప్పటికే ప్రాసెస్లో ఉన్న ఈ రైళ్ళకు వందే భారత్ అనే పేరు పెట్టి తాము కనిపెట్టినట్టు మార్కెటింగ్ టెక్నిక్స్ అనుసరించడం బీజేపీ పాలకుల ఘనత. వందే భారత్ రైళ్ళు విప్లవాత్మక మార్పేమీ తేలేదు. కనీసం జపాన్, చైనాల సరసన భారత్ను నిలిపే దృఢ సంకల్పం కూడా కేంద్ర పాలకుల కు లేదు. ప్రచారార్భాటం మాత్రం కనిపిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో చరిత్రాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మిషన్ భగీరథ ఒక అద్భుతం. ఇంటింటికీ తాగు నీరు ఇవ్వడం అదీ శుద్ధ జలాలు ఇవ్వడం ఒక అద్భుతం కాదా? వర్షపు నీటిని ఒడిసిపట్టుకునే చెరువుల వ్యవస్థను కాపాడుకుంటున్నాం. మిషన్ కాకతీయ ఒక మహాద్భుతం. దీనిని కాదనగలరా? కాళేశ్వరం ఒక ప్రపంచస్థాయి అద్భుతం కాదా? కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్, రైతుబంధు, రైతు బీమా వంటి అనేక పథకాలు తెలంగాణ మాడల్గా ప్రసిద్ధి చెందలేదా? ఇవాళ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని కేసీఆర్ పిలుపు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఈ విధంగా చెప్పుకోవడానికి కేంద్రం ఒక్క మంచి పథకం ప్రవేశ పెట్టిందా? పైగా నోట్ల రద్దు మొదలుకొని అనేక చర్యల ద్వారా పేద ప్రజలను నానా ఇక్కట్ల పాలు చేశా రు. మీ విధానాల వల్ల దేశం అల్లకల్లోలమవుతున్నది. దేశ ఆర్థిక పరిస్థితి పాతాళానికి చేరిం ది. అయినా ఇంకా గొప్పలు చెప్పుకుంటున్నా రు. దేశంలో ఏ ఒక్కరినీ బాగుపరచలేదు. గంటలు కొట్టడం, లైట్లు వెలిగించడంతో దేశం మారదు ప్రధానీ జీ!
సాధారణంగా రాష్ర్టాలకు నిధులు రావడానికి కొన్ని విధానాలు ఉన్నాయి. రాష్ర్టాలకు పన్నుల వాటా రావడం చాలా సాధారణమైన విషయం. ఫైనాన్స్ కమిషన్ నిర్దేశిత ప్రాతిపదికల ప్రకారం నిధులు కేటాయిస్తుంది. దాని ప్ర కారం ఆయా రాష్ర్టాలకు నిధులు రావడం సహజం. పైగా ఈ విధి విధానాలు కూడా తె లంగాణకు అన్యాయం చేసేవిగా ఉన్నాయి. రాష్ర్టాల కేటాయింపుల ప్రాతిపదిక ప్రకారమై నా ఎంతో కొంత నిధులు ఇవ్వక తప్పదు. ప్ర తి ఏటా ఇలా ఇచ్చే నిధులను తామే దయ తలిచి ఇస్తున్నట్టు కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్నది. ఇక్కడి బీజేపీ స్థానిక నాయకులు తామేదో ఒరుగబెడుతున్నట్టు గొప్పలకు పోతున్నారు.
కేంద్రానికి తెలంగాణ ద్వారా అందుతున్న పన్నులతో పోలిస్తే తిరిగి కేంద్రం ఇస్తున్నది అతి స్వల్పం అనేది తెలిసిందే. తెలంగాణ దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయింది. కేంద్రం కూడా వివక్ష చూపింది. దీనికి పరిహారంగా తెలంగాణకు అదనపు నిధులు ఏమైనా కేటాయిస్తున్నారా? తెలంగాణ రాష్ర్టా న్ని ఆదుకోవలసిన బాధ్యత మీకు లేదా? నిధు లు ఇవ్వక పోగా కనీసం అప్పులు కూడా తీసుకోకుండా అడ్డుకోవడం మీకు తగునా?
తప్పనిసరిగా జరిగే పనులు పక్కన పెడితే తెలంగాణకు మీ అంతట మీరు చేయాల్సిన పనులు ఏమైనా చేశారా? విభజన చట్టంలో ఇచ్చిన హామీలైనా అమలు చేశారా? అది మీ బాధ్యత కాదా? విభజన చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్ల తెలంగాణ ఎంతో ఇబ్బంది పడుతున్నది. ఈ విషయంలోనైనా చట్ట సవరణ చేసి తెలంగాణకు అండగా నిలిచారా? అది ప్రధానిగా మీ బాధ్యత కాదా?
అసెంబ్లీ స్థానాలు పెంచడానికి చిన్న సవరణ చాలు. కనీసం ఆ చిన్న సవరణ అయినా చేశారా? విభజన చట్టంలో హామీ ఇచ్చినట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఐటీఐఆర్ ప్రాజెక్టును అటకెక్కించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి మొండిచేయి చూపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగితే అదీ ఇవ్వలేదు. దీనికి కారణం మేం బాగుపడితే చూసి ఓర్వలేనితనం కాదా? తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉంటే మీకు గిట్టదు కదా?
అలాంటిది ఇప్పుడు తెలంగాణకు వచ్చి మీరు చేసేదేమున్నది? రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప తెలంగాణ ప్రజలకు మీ పర్యటన వల్ల ఒరిగేది ఏమున్నది?
దేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణలో డబ్లింగ్ పనులు చేపట్టడానికి ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. ఆలస్యంగానైనా, తప్పనిసరి పరిస్థితుల్లో డబ్లింగ్ పనులు చేశారు. అది కూడా మోదీకి గొప్పగానే కనిపిస్తున్నది. కొత్తగా రైలు మార్గం వేయడం కూడా కాదు. కేవలం డబ్లింగ్ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని రావడమే గొప్పగా అనిపిస్తున్నది మన బీజేపీ నాయకులకు.
– గోసుల శ్రీనివాస్ యాదవ్, 98498 16817