కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలూ తీసుకోవచ్చు. కానీ మోదీ-షా ద్వయంలోని కేంద్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేట్టు.
తెలంగాణపై, ప్రత్యేకించి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రభుత్వ సంస్థలను ఉసిగొల్పుతూ, వాటిని దుర్వినియోగం చేస్తున్నది. ఆదాయానికి మించి ఆస్తులుంటే తనిఖీలు చట్టం ప్రకారం అపరాద రుసుం విధించవచ్చు. కేసులూ పెట్టుకోవచ్చు. ఆపై ఈడీని ప్రయోగించవచ్చు. జైళ్లకూ పంపవచ్చు. ఇన్ని అవకాశాలున్నా వాటిని అనుసరించకుండా కేవలం భయోత్పాతా నికే గురిచేస్తూ దాడుల పేర నానా హడావుడి చేస్తూ తెలంగాణలో ఏదో జరగరానిది జరిగిపోతున్నదనే భయాన్ని ప్రజల్లో కల్పిస్తున్నది. కేం ద్రం ఎందుకిలా ప్రవర్తిస్తున్నది? తెలంగాణ నుం చి ఏం ఆశిస్తున్నదనే విషయాన్ని నియంతృత్వ కోణంలో ఆలోచిస్తేనే ఈ దాడుల వెనుక ఉన్న నేపథ్యం అర్థమవుతుంది.
తెలంగాణ ప్రజల్లో ఉన్న ‘కేసీఆర్’ ఆదరణ ను తగ్గించాలంటే ప్రభుత్వాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలి. పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దాడులతో దడ పుట్టించాలి. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ ఏకైక ఎజెండా ఇది ఒక్కటైతే, ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుల్లో అడ్డంగా దొరికి ఎటూ తప్పించుకోలేక అడ్డదారుల కోసం పాకులాడుతుండటం మరొకటి. కేసీఆర్ చెప్పినట్టుగానే బీజేపీ నాయకత్వం తెలంగాణలో కేం ద్రం రూపంలో బరితెగిస్తున్నది. దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలన్నింటినీ హైదరాబాద్లో మకాం వేయించింది. ఇక్కడి పోలీసులను కాద ని, వేల సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలో కి దించుతున్నది. వందల సంఖ్యలో అధికారు లు మోహరించడం, వందల సంఖ్యలో ప్రైవేట్ బౌన్సర్లతో గుండాలతో భయానక వాతావర ణం సృష్టిస్తున్నది. ఇదీ చాలదన్నట్టుగా ఈడీ పరిధిలోకి మరో 15 సంస్థలను కలిపేసి తెలంగాణ కోసమే ప్రత్యేక చట్టం తీసుకొచ్చారనిపిస్తున్నది. టీఆర్ఎస్ నేతలను తమ బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి పెంచుతున్నది. ఏకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఎక్కుపెట్టి పార్టీ మారాలని ఓపెన్ ఆఫ ర్ ఇవ్వడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ. ‘స్వయానా నా బిడ్డకే బీజేపి ఆఫర్ ఇవ్వడమేమిట’ని కేసీఆర్ తన పార్టీ బంధుగణంతో చెప్పడ మే ఇందుకు ఉదాహరణ. ఎమ్మెల్సీగా ఉన్న కవి త కూడా బీజేపీ అరాచకాలపై అదిరిపోయే కౌం టర్ ఇవ్వడంతో టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది.
తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు బీజేపీ పప్పులుడకవని ఆ పార్టీకి ఇప్పటికే అర్థమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం, క్యాసినో కేసులంటూ కేంద్రం టార్గెట్ చేస్తుంటే డోంట్ కేర్ అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. అందుకు ఉద్యమ నేత కేసీఆర్ తమవారికి ఇస్తున్న భరోసానే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అందుకే బీజేపీ పాచికలేవీ పారకపోవడంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగిస్తున్నా వారెవరిలోనూ భయమనేదే కనపడటం లేదు. మంత్రి గంగుల కమలాకర్పై దాడులు జరిగాయి. ఆయన ఇంట్లో లేని సమయంలో దాడులు చేసి పోన్లో ఫలానా చోట బీరువాలున్నాయి. ఫలానా చోటలో లాకర్లున్నాయి. మీక్కావాల్సిన కాగితా లు ఫలానా దగ్గరున్నాయని ధైర్యంగా చెప్పారు. మంత్రి గంగుల దగ్గర ఏమీ స్వాధీనం చేసుకోలేకపోయారు. ఆ మర్నాడే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను టార్గెట్ చేశారు. ఆయన పీఏకు నోటీసులిచ్చి మంత్రిని దారికి తెచ్చుకుందామనే ప్రయత్నం చేశారు. ఇక్కడా బీజే పీ ప్రయోగం అనుకున్నంత సఫలీకృతం కాలేకపోయింది. ఇక లాభం లేదని మంత్రి మల్లారెడ్డిపై వాలిపోయారు. మూడు రోజులు ఏకబిగిన దాడులతో మంత్రిని, తన ఇద్దరు కొడుకులను, కుటుంబ సభ్యులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఐటీ అధికారుల వేధింపులతో, బలత్కారంతో మంత్రి మల్లారెడ్డి కొడుకు దవాఖాన పాలయ్యారు. మూడురోజుల పాటు గుక్క తిప్పనీయకుండా చేశారు. వందల కోట్లు దొరుకుతున్నాయని తెలంగాణలో మీడియా డైవర్షన్తో కలరింగ్ ఇచ్చారు. మల్లారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే పెద్ద వ్యాపారవేత్త. కష్టాలు పడి తన వ్యాపార సౌధాన్ని బలంగా నిర్మించుకున్న తర్వాతే ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. మల్లారెడ్డికి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉందనేది బహిరంగ విషయమే. అలాగని న్యాయ, పన్నులు, ఇతర త్రా చట్టం ముందు మల్లారెడ్డి సామాన్యుడే. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డిపై కేవలం రాజకీయ దాడిగానే చూస్తున్నది తెలంగాణ సమాజం. బీజేపీలోకి లొంగకుంటే టీఆర్ఎస్లో ఉన్న పాపానికి కేసీఆర్ అందరి దేవుడు అన్నందుకు ఆయన్ను టార్గెట్ చేసింది. సరే మూడురోజులు వందల సంఖ్యలో అధికారులు, వారికి రక్షణగా కేంద్ర బలగాలు, ప్రైవేట్ బౌన్సర్లతో బయపెట్టినా చివరికి ఆయన ఇంట్లో దొరికింది కేవలం రూ.28 లక్షలు మాత్రమే.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ విచారణకు బీజేపీ అగ్రనాయకత్వమే భయపడుతున్నది. సిట్ విచారణను అడ్డుకునేందుకు ఆ పార్టీ నాయకత్వం ఓ పక్క విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే మరోపక్క బీఎల్ సంతోష్ లాంటివారు తరచూ కోర్టు మెట్లు ఎక్కుతున్న విషయాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి సంబంధం లేనప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఎందుకు భయపడుతున్నట్టు? అని ప్రజలే ప్రశ్నిస్తున్నారు.
దేశమంతటా విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజా ప్రభుత్వాలను కూల్చివే స్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్న బీజేపీకి తెలంగాణలో కేసీఆర్ కొరకరాని కొయ్యలా మారారు. దీంతో ప్రధాని మోదీ సహా అమిత్ షా, సంతోష్లు తెలంగాణ పోలీసులంటేనే గజగజా వణికిపోతున్నారు. ముఖ్యం గా తప్పడు విధానాలతో నియంతృత్వ పోకడలతో రాజ్యమేలుతున్న బీజేపీకి, కేం ద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నారనడం లో సందేహం లేదు.తెలంగాణ ప్రజల్లో ఉన్న ‘కేసీఆర్’ ఆదరణ ను తగ్గించాలంటే ప్రభుత్వాన్ని
ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలి. పార్టీ నేతలపై దర్యాప్తు సంస్థల దాడులతో దడ పుట్టించాలి. కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ ఏకైక ఎజెండా ఇది ఒక్కటైతే, ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసుల్లో అడ్డంగా దొరికి ఎటూ తప్పించుకోలేక అడ్డదారుల కోసం పాకులాడుతుండటం మరొకటి.
వెంకట్ గుంటిపల్లి: 94949 41001