ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో టూరిస్టుల గోల చూసినం మనమందరం. ‘రండి, చూడండి, నేర్చుకోండి’ అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన సూచన వారికి పనికొచ్చి ఉంటది. భేషజాల వల్ల తెలంగాణ గొప్పతనం రాజకీయ నాయకులు పైకి చెప్పరుగానీ, నటుడు రజనీకాంత్ అయితే చంద్రబాబు సమక్షంలోనే చెప్పిన్రు. బీఎస్పీకిగానీ, కాంగ్రెస్కు గానీ తెలంగాణకు ఏమి చేస్తమో చెప్పేంత సీన్ లేదు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఏ అంశంపైనా చర్చ చేసే జ్ఞానమూ, దీర్ఘదృష్టి ఇద్దరికీ లేవు. చర్చకు సన్నద్ధత లేని చోట రచ్చనే కదా మిగిలేది?
కాన్షీరాం రాజకీయ తాత్వికత వంటబట్టి న ఈ వ్యాసకర్త ఘంటాపథంగా చెప్పగలిగేది.. బీఎస్పీ తొలినాళ్ళ లక్ష్య ప్రకటనకు మాయావతి దూరంగా జరిగిపోయిన్రని. కాన్షీ రాం ఏంత నిబద్ధుడో అంత గడుసరి కూడా. ఏకకాలంలో బీజేపీ, కాంగ్రెస్ల మద్దతు తీసుకుని రాజకీయం చేసిండు. ‘తోవెంట పోతున్న బాటసారిని ఎక్కించుకుంటమని గాడిదా, గుర్రమూ రెండూ అడిగినయి, ఎందుకు కాదంటా.. నాకు గమ్యం ముఖ్యం’ అన్నరు. లక్ష్యం స్పష్టమైతే, దానికి కట్టుబడి ఉంటే గుంజాటన అవసరము ండదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ కోసం ‘గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుం టా’ అన్న మాట మీకు ఇపుడు గుర్తుకురావడం సహజం, న్యాయం కూడా! క్రాంతదర్శుల రాజకీయం అది.
మాయావతి భ్రాంతిదర్శి! అందుకే ఆమె తమ మూలాలను మరచి, లక్ష్యాలను విడిచి, బీజేపీ అడుగుజాడల్లో అణిగిమణిగి నడుచుకుంటున్నరు. ‘నీ చరణ కమలాల నీడయే చాలు’ అనే సినీ గేయం గుర్తుకు తెస్తూ నీచ, రణ, కమలాల మురిసిపోతున్నరు తానిక భద్రమని. కాబట్టే మొన్న మీటింగ్లో మోదీని పల్లెత్తు మాట అనలేదామె! దళిత బహుజనుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న, అదానీ రూపంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తున్న, మతమౌఢ్యంతో దేశాన్ని నిలువునా చీలుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆమెకు సుద్దపూసలా కనిపిస్తున్నది. తాను కానీ, తానిప్పుడు మెచ్చే బీజేపీ కానీ ‘దళిత బంధు’ లాంటి పథకం గురించి ఆలోచన చేసిన్రా? దళితులకు తాయిలాలు విసరడమే తప్ప వారి ఆర్థిక స్వావలంబనకు, తద్వారా సామాజిక మార్పుకు ప్రోది చేసే నిర్ణయాలు తీసుకున్నరా? లేదు కదా! మరింక వారి విరుపులకు అర్థమేమిటి? బీఎస్పీపై ఇంతకంటే రాయడం అనవసరంగానీ.. కాంగ్రెస్ పార్టీ గురించి, ముఖ్యంగా ఆ పార్టీకి శల్యసారథి రేవంత్ రెడ్డి గురించి కొంత సంభాషించుకుందాం.
దేవేందర్ గౌడ్, నాగం జనార్ధన రెడ్డి, ఎర్రబెల్లి దయాకర రావు, ఎల్.రమణ, కడియం శ్రీహరి.. వీరందరూ తెలంగాణకు అనుకూలం గా ఉత్తరం ఇవ్వండని నాడు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చినవారే. ఆంధ్రాప్రాంత నాయకులు స్వర్గీయ ఎర్రం నాయుడు, కోడెల శివప్రసాద్ సహా యనమల రామకృష్ణుడు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు లాంటి సీనియర్లు కూడా తెలంగాణ పట్ల సానుకూలత చూపారు. ఎవరిది వారికి ఉంటే తప్పేమిటన్నారు.శ్రీకృష్ణ కమిటీకి కడియం, య నమల ఇద్దరి చేతుల మీదుగా లెటర్ అందింది.
ఈ మొత్తం ప్రాసెస్లో రేవంత్ ఎక్కడా లేడు. తన బ్లాక్మెయిల్ పనుల్లో ఎప్పటిలానే తలమునకలుగా ఉన్నడు. ఒక్క తెలంగాణ అంశమేకాదు. ఏ ప్రజా సమస్య పట్లా రేవంత్ మనస్ఫూర్తిగా పని చేయలేదు తన జీవితంలో.
టీడీపీలో రేవంత్ నాకు ఎనిమిదేండ్ల కొలీగ్. ఏ ఒక్కరోజూ అతని నోటి వెంట ‘జై తెలంగాణ’ అన్న పదం రాలేదు. ఇపుడు ప్రియాంకాగాంధీ సభలో కూడా అతను ‘జై తెలంగాణ’ అనలేదు. అలాంటోడు ‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ’ అంటే నవ్వు పొరలు పొరలుగా వస్తున్నది. మొత్తం తెలంగాణ అంతటా రేవంత్ లాంటి చీప్ క్యారెక్టర్ ఏ పార్టీలోనూ, ఏ సంఘంలోనూ లేడు. కాంగ్రెస్ ఖర్మ కొద్దీ అతన్ని మోస్తున్నది. వారికి నా సానుభూతి.
‘తినడానికి పాలకోవా లేదుగాని, మియామాల్కోవా కావాలట’; ‘సమంత సోకులా’; ‘ఆలుగడ్డలు అమ్మెటోళ్ళు, కల్లు గీసుకునే వారికి రాజకీయ భిక్ష పెట్టినం’… ఇవీ రేవంత్ మాట లు. మహిళలను, బహుజనులను అత్యంత అవమానకరమైన భాషలో తరచూ మాట్లాడే ఈయనది ముఖ్యమంత్రి స్థాయా? అణువణువునా అహంకారం, కులపిచ్చి, బ్లాక్మెయిల్ రాజకీయాలు, అక్రమార్జన, మితిమీరిన స్వార్థం మూర్తీభవించినవాడు రేవంత్. ఇతనా తెలంగాణ గురించి మాట్లాడదగినవాడు?! ఇతనా కాంగ్రెస్ను లీడ్ చేసేది? ఇతనా యువతకు మార్గదర్శి?!
కాళ్ళ కింద నేల కదిలిన వారు, మెడ మీది తలకాయలో గుజ్జు లేని వారు ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలరా? కాబట్టే, వారి ‘డిక్లరేషన్’ గురించి మాట్లాడే అవసరం రావడం లేదు. అదొక పట్టపగలు పరిహాసం!
ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా నిబద్ధంగానో, అబద్ధంగానో అభివృద్ధి గురించి మాట్లాడుతరు. కానీ, స్వయంపాలనలో వెలుగులీనుతున్న తెలంగాణలో అభివృద్ధి గురించి అధికారులు కూడా సగర్వంగా మాట్లాడగలరు. ‘police is not just for law and order. we are partners in economic develo pment. public safety and public order is essential for development’ – అవి మొన్న రామగుండంలో డీజీపీ అంజనీకుమార్ అన్న మాటలు! పాలకుడిని ఫాలో అవుతరు అధికారులు. దార్శనిక పాలనకు త్రికరణశుద్ధిగా కట్టుబడి ఉంటరు. రౌతు సమర్థతే గుర్రపు వేగం! ‘అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ -అరుణాస్పదపురం గురించి అల్లసాని పెద్ద న చెప్పినట్టు తెలంగాణలో చేవగలిగిన నాయకత్వం, అధికారగణం ఉన్నది. అందుకే, ఇక్కడికొచ్చి నేర్చుకుని పొమ్మనేది!
అన్నిరంగాల్లో తెలంగాణ ప్రజలు సుఖ సం తోషాలతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నది బీఆర్ఎస్. కుల వర్ణ వర్గ మతాలకతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా పేదల సంక్షేమ-అభివృద్ధి దిశగా పథకాలు అమలు చేస్తూ… గాంధీ, అంబేద్కర్, గౌతమబుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తున్నరు కేసీఆర్. ప్రతిపక్షాలేమో ప్రతి పక్షం రోజులకోసారి ‘మాకు అధికారం ఇవ్వండి, కేసీఆర్ను దింపండి, ప్రగతి భవన్పై పార్టీ జెండా ఎగరేస్తాం’ అంటూ ఎంతసేపూ అధికార యావయేగానీ.. అధికారం ఎందుకు కావాలి? అన్నది చెప్పరు. అసలు ప్రగతి భవన్పై ఏ పార్టీ జెండా కూడా ఎగరదు అన్న విషయం కూడా వీరికి చెప్పాల్సి రావడం మన ఖర్మ!
మరి కేసీఆర్ ఏమంటున్నరు?
ప్రపంచంలోనే భారత్ను మేటి
చేద్దామంటున్నరు. ఇంటింటికీ
తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు/బీమా, దళిత బంధు, ఐపాస్, బీపాస్, టీహబ్, వీహబ్.. అన్నీ
దేశమంతా ఇద్దామంటున్నరు.
డిక్లరేషన్లు కాదు.. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ పీఠికయే
మా మేనిఫెస్టో అంటున్నరు.
నేను చెపితే మీరు నమ్మాల్సిన పని లేదు, తెలంగాణలో ఇవి సాకారమైనయా లేదా తెలుసుకోండి, నలుగురికి చెప్పండి అంటున్నరు. ఇంతకంటే ఎవరెక్కువ చేయగలరు? దశాబ్దాల పాటు రాష్ర్టాలని, దేశాన్ని ఏలిన మీ పార్టీలు ఇట్ల అడుగులు ఏమన్న వేసినయా?
మాయావతి, ప్రియాంకలకు కొన్ని విషయాలు. ఇటీవల తెలంగాణ పదవ తరగతి, ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రైవేటు స్కూళ్ల ను, కాలేజీలను ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కాలేజీలు అధిగమించి, వాటికి అందనంత దూరంలో నిలబడ్డాయి. విద్యావ్యవస్థ గురించి మీ మొసలి కన్నీరుకు ఏమన్న విలువ ఇస్తదా తెలంగాణ ఇంక? ఇది ఉడికిన అన్నంలోని ఒక్క మెతుకు మాత్రమే.
ఈ వెలుగు దేశమంతా పరచాలి. కాబట్టే, కేసీఆర్ను బలోపేతం చేయాలి. ‘బలవంతుడే భగవంతుడు’ అన్నడు తిరుమలగిరి బుచ్చిరెడ్డి. బలవంతుడే సైతానులను తరిమి వేయగలిగేది తప్ప.. కేసులకు భయపడి నక్కి నక్కి దాక్కునే వారు కాదు; ఓట్లు కొంటూ పట్టుబడి చిప్పకూడు తిని వచ్చిన దొంగలు, సొంత పార్టీనే అడుగు వట్టిస్తున్న నీతి లేని నేతలు కాదు; దశా-దిశా లేని రాజకీయ మూకలు కాదు! వీరిని తరిమేద్దాం. ఈన గాచి నక్కల పాలు చేసుకోవద్దు మన గతిని, దేశ స్థితిని. ఇంక నిర్ణయం మీదే!
– శ్రీశైల్రెడ్డి పంజుగుల 90309 97371