ఇరువై ఏండ్ల కిందట 2001 ఏప్రిల్ 27న తెలంగాణ ప్రాంత ఆత్మగౌరం, అస్తిత్వం కోసం పుట్టింది టీఆర్ఎస్. నాడు సమైక్య రాష్ట్రంలో రాష్ట్రాన్ని తమ కంచుకోటలుగా మలుచుకున్న కాంగ్రెస్, టీడీపీలను ఎదురించి వారికి పోటీగా నిలబడ్డారు నాటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్. బలమైన సమైక్య పార్టీలను ఎదుర్కొంటూ ఒక్కడిగా మొదలయ్యారు. తను పార్టీని స్థాపించిన రోజు ‘ఈ బక్కమనిషితో తెలంగాణ సాధ్యమా?’ అన్నారు. ‘తెలంగాణ ఇతడు తెస్తాడా?’ అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా మొక్కవోని దీక్షతో ముందుకుసాగారు కేసీఆర్. తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తాను ఒక్కడిని కాదు, తనకు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల అండ ఉన్నదని బయల్దేరారు. ఎన్నో హేళనలు.. ఎన్నో ఛీత్కారాలు. ఈ ఛీత్కారాలనే సత్కారాలుగా భావించి ముందుకుసాగారు కేసీఆర్.
పద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నది. వాటన్నింటిని ఎ దుర్కొన్నారు ఉద్యమ నేత కేసీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసినా యావత్ తెలంగాణ జాతిని ఏ కంజేసి, దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించారు. కేసీఆర్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. తాను సాధించిన తెలంగాణకు ప్రజల ఆశీర్వాదంతో తానే ముఖ్యమంత్రి అయ్యారు. పద్నాలుగేండ్ల సుదీర్ఘ పోరాటంలో తాను ప్రజల వద్దకు వెళ్లి చూసిన కష్టాలనే పథకాలుగా మలిచారు. తత్ఫలితంగా తెలంగాణ అద్భుతమైన ప్రగతి ది శగా సాగుతున్నది. పేదరిక నిర్మూలన, ప్రజల కలలను నిజం చేయడం, తెలంగాణ అభివృద్ధే ఎజెండాగా ముందుకుసాగారు. సబ్బండవర్గాల సంక్షేమమే ఎజెండాగా ఎంచుకున్నారు. కల్యాణలక్ష్మి, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ లాంటి పథకాలతో దేశ మే గర్వించదగ్గ స్థాయికి తెలంగాణ చేరుకున్నది. విప్లవాత్మక పథకాలకు నాంది పలికి యావత్ దేశంలోనే తెలంగాణ భేష్ అనుకునేలా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతుల కరెంట్ కష్టాలు తీర్చుతూ 24 గంటల ఉచిత విద్యుత్తునందిస్తూ దేశం అబ్బురపడేలా చేశారు. ఈ నిర్ణయం నాడే దేశంలో ప్రకంపణలను సృష్టించింది. ఇరిగేషన్ వండర్ కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును మూడేండ్లలో నిర్మించి దేశాన్నే ఔరా అనిపించా రు. ఆయన విజన్ను మెచ్చిన తెలంగాణ ప్రజలు రెండవసారి కూడా ఆయనకే పట్టం గట్టారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆసరా పింఛన్ డబుల్ చేసి వృద్ధులు, దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చేశారు. రైతు బంధు సాయం పెంచారు. దేశంలోనే విప్లవాత్మక నిర్ణయమైన ‘దళితబంధు’తో దళితుల బతుకుల్లో వెలుగులు నింపారు. వెనక్కి నెట్టేయబడ్డ దళితుల బతుకుల మార్పునకు నాంది పలికారు. విద్య, వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ముందుకు సాగుతున్నది. ప్రతీ జిల్లాకో మెడికల్ కాలేజీ స్థాపించి ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ర్టాలకు పెద్దన్నగా నిలవాల్సిన కేంద్రం తెలంగాణపై చిన్నచూపు చూపిస్తున్నా తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
అదే సమయంలో దేశంలో ఒక విచ్ఛిన్నకర శక్తుల పాలన సాగుతున్నది. పేద, దళిత బహుజనులపై దాడులు జరుగుతున్నయి. కులమతాల పేరుతో విధ్వంసం చేస్తున్నారు. అభివృద్ధిని మరిచి ప్రభుత్వాలను కూల్చటం, ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నది. దేశంలో ఉన్న వనరులనుపయోగించి ప్రజలకు ఆ ఫలాలను అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలంగాణ వలె దేశవ్యాప్తంగా ప్రగతి ఫలాలు అందించేందుకు పూనుకున్నారు.
దేశ సంపదను పెంచి పేదలకు పంచేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారు. ఆ పార్టీకి దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావానికి తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచి తన సంకేతాన్ని ప్రజలకు తెలియజేశారు.
కేసీఆర్ నేతృత్వంలో జాతీయపార్టీ అయిన బీఆర్ఎస్ మహారాష్ట్రలోని నాందేడ్లో భారీ బహిరంగ సభను నిర్వహించింది. సభ విజయవంతమైంది. సభావేదికగా యావత్ భారతజాతికి కేసీఆర్ తన సంకేతాన్నిచ్చారు. దేశంలో వనరులున్నా తాగు, సాగునీరు ప్రజలకు సక్రమంగా అందడం లేదు. దేశంలో, మహారాష్ట్రలో బీజేపీనే అధికారంలో ఉన్నది. అయినప్పటికీ కేంద్రం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మహత్యల వెనుక అంతర్యమేమిటో తెలుసుకోవాలి. ఈ దేశంలో 50 వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుంటే పాలకులు మాత్రం కులమతాల పేరుతో కుంపట్లు పెడుతూ ఇదే అభివృద్ధి అని ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ దేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఏండ్ల తరబడి పాలించారు. కానీ సాధించింది మాత్రం శూన్యం. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఉత్పత్తి కరువై, విదేశీ దిగుమతులు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో చిక్కుకున్నది. రూపాయి విలువ తగ్గి, ధరలు పెరిగి దేశంలోని పేదలు, రైతుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయి.
ఈ పరిస్థితి పోవాలంటే దేశంలో తెలంగాణ మాదిరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. దళితులు, బహుజనులు అభ్యున్నతి సాధించాలంటే సీఎం కేసీఆర్ ఈ దేశానికి నాయకత్వం వహించాలి. ఇరువై ఏండ్ల కిందట తెలంగాణ కోసం టీఆర్ఎస్ను స్థాపించిన కేసీఆర్ నేడు దేశాభివృద్ధి కోసం భారత రాష్ట్ర సమితిని స్థాపించారు. కేసీఆర్ నాటి తెలంగాణ లక్ష్యాన్ని సాధించినట్టే… నేడు దేశాభివృద్ధిని సాధిస్తారనే నమ్మకం నాందేడ్లో కేసీఆర్ చేసిన ప్రసంగం తర్వాత పెరిగింది. దేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి విముక్తి కలిగించి నిజమైన భారత్ను నిర్మించే శక్తి ఒక్క కేసీఆర్కే ఉన్నది. అందుకు నాందేడ్ సభ, ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశమే తార్కానం. నాందేడ్ వేదికగా భారీస్థాయిలో బీఆర్ఎస్కు వచ్చిన ఆదరనే అందుకు సాక్ష్యం.
(వ్యాసకర్త: టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్)
డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్