‘అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’. ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇప్పటికే అధిష్ఠానం కింది స్థాయి క్యాడర్ను ఆదేశించింది. విద్య, వైద్యం ఉచితంగా అందితే ఒక కుటుంబానికి నెలకు ఏ స్థాయిలో డబ్బులు మిగులుతాయో కూడా వివరించాలని చెప్పింది. హామీ సరే.. మరి దీనిని ఎలా అమలు చేస్తారో విడమరిచి చెప్పేందుకు పార్టీ సిద్ధంగా లేదు. ఎందుకంటే దానిపై ఆ పార్టీ దగ్గరే సరైన ప్రణాళిక లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఉన్నా యి. వాటన్నింటిలో విద్య ఉచితంగానే అందుతున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షి ప్ లాంటి స్కీమ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తల్లిదండ్రుల ఛాయిస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉచిత విద్య కావాలనుకున్న వాళ్లు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించుకునే వీలున్నది. అయితే ఇప్పుడు బీజేపీ ఇస్తున్న ఉచిత విద్య హామీ అమలు ఎలా చేస్తారోననే సందేహం అందరిలో ఉన్న ది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటారా? ప్రభు త్వ పాఠశాలలు, కళాశాలల సంఖ్యను పెంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? లేకుంటే తల్లిదండ్రులకే ఛాయిస్ ను విడిచిపెట్టి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించినా వారికి ఫీజును పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కడుతుందా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్న లే. బీజేపీ సమాధానమివ్వని ప్రశ్నలే.
ఆరోగ్యానికి ఆయుష్మానే మందా?
ఉచిత వైద్యాన్ని ఎలా అందిస్తారనేది కూ డా మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్ సీలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానాల్లో వై ద్యం ఉచితంగానే అందుతున్నది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ , సెమీ గవర్నమెం ట్ దవాఖానల్లోనూ ఉచిత వైద్యం ఉన్నది. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే 50 నుం చి 70 శాతం బిల్లును ప్రభుత్వం సంబంధిత వ్యక్తులకు చెల్లిస్తున్నది. అయితే బీజేపీ ఇస్తామన్న ఉచిత వైద్యం ఎలాంటిదనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ప్రైవేటు దవాఖానలను త మ ఆధీనంలోకి తీసుకొని, వాటిని ప్రభుత్వ ఆస్పత్రులుగా మార్చేస్తారా? లేకపోతే ఏదైనా ప్రత్యేక ఇన్సూరెన్స్ స్కీమ్ను ఉపయోగించి అందరికీ ఆరోగ్య బీమా చేయించి.. రోగాలు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటే వాటికి బిల్లులు చెల్లిస్తారా? లేకపోతే సర్వ రోగాలకు సవాలక్ష నిబంధనలున్న ఆయుష్మాన్ భారత్ ను నివారిణిగా చూపిస్తారా? ఇవి కూడా బీజేపీ చెప్పడానికి ఇష్టపడని ప్రశ్నలు.
జీహెచ్ఎంసీ‘కొత్త వాహనం’హామీలాగేనా ?
జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు హైదరాబాద్లో వరదలు వచ్చాయి. వేలాది వాహనాలు ఆ వరదల్లో కొట్టుకుపోయాయి. అయితే ఎన్నికల సమయంలో బండి సంజయ్ బీజేపీ గెలిస్తే వరదల్లో కొట్టుకుపోయిన, దెబ్బతిన్న వాహనాలకు బదులు ఆ యజమానులకు కొత్త వాహనాలను కొనిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాహనాలకు ఉన్న ఇన్సూరెన్స్ను ఇప్పిస్తామని చెప్పి నవ్వుల పాలయ్యారు. బం డి సంజయ్ నోటి వెంట వచ్చిన ఉచిత విద్య, వైద్యం హామీ కూడా సేమ్ అలాగే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఉచితాలకు వ్యతిరేకమని చెబుతూనే..
తెలంగాణలో అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నోటికొచ్చిన హామీలు ఇస్తున్నా.. వాటిని ఎలా అమలు చేస్తామని మాత్రం ప్రజలకు వివరించలేకపోతున్నది. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలవుతున్నా హామీలను సైతం కొనసాగిస్తామని చెబుతూ వాటికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేకపోతున్నది. ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయానికి అందుతున్న ఉచిత విద్యుత్ ను కొనసాగిస్తుందా లేదా అన్నది రాష్ట్ర యూనిట్ చెప్పలేకపోతున్నది. రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ జోలికే వెళ్లడం లేదు. అంతేకాకుండా పలు హామీల అమలులో బీఆర్ఎస్ విఫలమైందని బీజేపీ చెబుతున్నా అమలవుతున్న హామీలను ఎలా నెరవేరుస్తామనే భరోసాను సైతం బీజేపీ ప్రజలకు ఇవ్వలేకపోతున్నది.
కేంద్రనాయకులు అంతే..!
తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు కేసీఆర్ కుటుం బ పాలన గురించి మాట్లాడడమే తప్ప తెలంగాణకు వారు ఏం చేద్దామనుకుంటున్నారో ఎప్పుడూ చెప్పడం లేదు. ఇప్పటి వరకు తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులు? ఏ యే రంగంలో ఎంత ఖర్చు చేశారు? భవిష్యత్తులో వేటికి ఎంత ఖర్చు పెట్టబోతున్నారు..? వంటి వాటిని కూడా చెప్పలేకపోతున్నారు.
కేంద్రలోనూ దక్షిణాది పథకాలే.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న పలు పథకాలు దక్షిణాది రాష్ర్టాల నుంచి కాపీ కొట్టినవే. ఆయుష్మాన్ భారత్కు ఆధారం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ అని అందరికీ తెలిసిందే. కేసీఆర్ ప్రారంభించిన రైతుబంధును కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ అంటూ సాయం చేయడం మొదలు పెట్టారు. కేంద్రం చెప్పే చాలా పథకాలు దక్షిణాది రాష్ర్టాల్లో ఎప్పటి నుం చో అమలవుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడం సాధ్యం కాదని కేంద్ర నాయకత్వానికి తెలిసినా.. ఇప్పటికి ఉన్న నాలుగు ఎంపీ సీట్ల సంఖ్య ఆరుకు పెరుగొచ్చనే అంచనాతోనే రాష్ట్రంపై దృష్టి పెంచింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దాదాపు సగానికి పైగా సెగ్మెంట్లలో బీజేపీకి అభ్యర్థులే లేరనే విషయం బహిరంగ రహస్యమే. బీజేపీకి ఎంపీలున్న నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 28 అసెంబ్లీ స్థానాలున్నా యి. వీటిలో పార్టీ ఎన్ని గెలవచ్చో కచ్చితంగా చెప్పే వారు కూడా లేరు. సరైన ప్రణాళిక లేకుండా ఎంతసేపూ తెలంగాణలో అధికార పక్షంపై దూషణల తో కాలం గడుపుతున్న బీజే పీని రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజ లూ విశ్వసించటం లేదు.
– ఫిరోజ్ ఖాన్
96404 66464
( వ్యాసకర్త: సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, కాలమిస్ట్)