‘మడుగులన్ని అడుగంటి పోయినవి, బావులు సావుకు దగ్గరైనవి., వాగులు వంకలు ఎండిపోయినవి. సాకలి పొయ్యిలు కూలిపోయినవి. మంగలి కత్తులు మొండి బారినవి.’ ప్రముఖ ప్రజాకవి గోరటి వెంకన్న తెలంగాణ గోస ఏకరువు పెట్టిన సందర్భంలో రజకులు, నాయీబ్రాహ్మణుల గురించి రాసిన పదాలు. ఆయన పాడిన విధంగానే సీమాంధ్రుల పాలనాకాలంలో వృత్తులు విధ్వంసానికి గురైనయి. వారి పాలనలో అప్పటి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అవలంబించిన ఆర్థిక, పారిశ్రామిక, ప్రపంచీకరణ విధానాలతో కులవృత్తులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి.
ఎన్నోఏండ్లుగా సాంప్రదాయ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న రజక, నాయీ బ్రాహ్మణుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. పొద్దంతా మురికి చాకిరీ చేస్తున్న వారికి రెండుపూటల కడుపునిండా తిండి ఉండేది కాదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో వారి జీవితాలు దుర్భరంగా గడిచేవి. శ్రమకు తగ్గ ఫలితం లేక గ్రామీణ ప్రాం తాల్లో రజకులు, నాయీబ్రాహ్మణులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఆసాముల ఇండ్ల వద్దకే పోయి బట్టలు ఉతుకుతూ, కటింగ్చేస్తూ జీవితాన్ని గడిపారు. వారికి సరైన చేయూత లేకపోవడంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డారు. వరుస గా ఏర్పడిన కరువుల వల్ల చెరువుల్లో, వాగుల్లో, వంకల్లో నీళ్లులేక తమ కులవృత్తులను వదిలి పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్ళారు.
పట్టణ ప్రాంతాల్లో కోట్లాది రూపాయల పెట్టుబడితో పెట్టుబడిదారులు రజక, నాయీబ్రాహ్మణ వృత్తుల్లోకి చొరబడటంతో వృత్తిని నమ్ముకున్న వారంతా అక్కడ కూలీలుగా మారాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితిలో రజక, నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వారికి కనీస వేతన చట్టం లేకపోవడంతో శ్రమకు తగ్గ ఫలితం దక్కలేదు. గ్రామీణప్రాంతాల్లో వారికిచ్చే కట్టడిలోనూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది.
రజకులు, నాయీ బ్రాహ్మణులు ఏర్పాటు చేసుకున్న సొసైటీలకు రుణాలు అందించడంలో గత ప్రభుత్వాలు వివక్ష చూపించాయి. ఆంధ్ర పాలకుల పాలనలో రజకులు, నాయీబ్రాహ్మణులు పోరాడి సాధించుకున్న రాష్ట్ర రజక ఫెడరేషన్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పడినప్పటి నుంచి 150 యూనిట్ల ఉచిత విద్యుత్ అడిగినా ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు.1982లో రజక ఫెడరేషన్ ఏర్పడితే తెలంగాణ వచ్చే నాటికి ఉమ్మడిపాలనలో 33 ఏండ్లలో రజకుల సంక్షేమానికి రూ. 62 కోట్ల 80 లక్షలు మాత్రమే ఖర్చు చేసి చేతులు దులుపేసుకున్నారు.1988లో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పడింది. దానిద్వారా తెలంగాణ వచ్చేనాటికి వారి సంక్షేమానికి ఖర్చుచేసింది కేవలం 16 కోట్లు మాత్రమే.
మన భారతీయ సమాజంలో సేవాకులాలు వారిసేవలు అందించక పోతే ఈ సమాజం అగమ్య గోచరంగా ఉండేదని మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సందర్భాలలో చెప్పారు. ముఖ్యంగా రజకులు మాసిన బట్టలు ఉతుకకుండా, నాయీ బ్రాహ్మణులు గడ్డాలు, మీసాలు చేయకుండా ఉంటే ఈ సమాజం కంపు కొట్టేదని, సేవా వృత్తికారులైన రజక నాయీ బ్రాహ్మణులు సమాజ పరిశుభ్రతకు పాటు పడుతున్నారని అనేక సందర్భాల్లో గుర్తు చేశారు.
తెలంగాణ స్వరాష్ర్టం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గ్రామీణ కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించారు. గొర్లు, మేకల పెంపకం దారులు, మత్స్యకారులు, గీత, నేత, తదితర కులవృత్తుల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే రోల్ మాడల్గా నిలిచారు.
రజక, నాయీబ్రాహ్మణు లు ఆర్థికంగా అభివృద్ధి చెం దాలనే లక్ష్యంతో అధికారం లోకి వచ్చిన రెండేండ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ రజకుల లాండ్రీ షాపులకు, ధోబీ ఘాట్లకు, నాయీబ్రాహ్మణు ల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు ఇచ్చారు. 1లక్షా 7 వేల 574 మందికి ట్రేడ్ లైసెన్స్లు, రెంటల్ అగ్రిమెంట్, వ్యాపార దృక్పథంతో కాకుం డా ఎల్టి4 (ఎ) స్పెషల్ క్యాటగిరీ కింద షరతులు లేని సులభతరమైన విధి విధానాలతో రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచిత మీటర్లతో సహా ఉచిత విద్యుత్తు అందించారు. ఎనిమిదేండ్లలో రజకుల సంక్షేమానికి రూ.125 కోట్లు, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ. 80 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. రజకులు మురికి నీటితో బట్టలు ఉతికి అనారోగ్యాలకు గురి కావద్దని బెంగళూరు తరహాలో 8 జిల్లా కేంద్రాల్లో ఆధునిక ధోబీ ఘాట్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
అంతేకాకుండా ప్రతి మున్సిపల్ పట్ట ణ కేంద్రంలో రాష్ర్ట మున్సిపల్ శాఖామాత్యులు కేటీఆర్ మున్సిపల్, కార్పొరేషన్లలో ఆధునిక ధోబీఘాట్లను మంజూరు చేశారు. ఒక్కొయూనిట్ రూ. 2 కోట్ల ఖర్చుతో 100 సబ్సిడీతో మంజూరు చేయడం చరిత్ర లో మరిచిపోలేని సందర్భం. తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ రజకుల ఆర్థికాభివృద్ధికి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం.
తెలంగాణ కల సాకారమైన అనతికాలంలోనే చాకలి ఐలమ్మ ఉద్యమ స్ఫూర్తిని ప్రభుత్వం గుర్తించింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో చాకలి ఐలమ్మ జయంతిని ప్రతి ఏడాది అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆయా కులాలకు ఆత్మ గౌర వ భవనాలు నిర్మించి రజకులు, నాయీ బ్రాహ్మణులకు కేసీఆర్ ఆరాధ్య దైవమయ్యారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సేవా వృత్తులకు ఊతం ఇచ్చే విధంగా 100 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల చొప్పున ఒక్కో కుటుంబానికి ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని అన్ని వృత్తుల వా రు స్వాగతిస్తున్నారు.
రజక నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రెండేండ్ల కాలంలోనే రజకుల లాండ్రీ షాపులకు, ధోబీ ఘాట్లకు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు నెలకు 250 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు ఇచ్చారు. 1 లక్షా 7 వేల 574 మందికి ట్రేడ్ లైసెన్స్లు, రెంటల్ అగ్రిమెంట్, స్పెషల్ క్యాటగిరీ కింద షరతులు లేని సులభతరమైన విధి విధానాలతో రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచిత మీటర్లతో సహా ఉచిత విద్యుత్తు అందించారు. ఎనిమిదేండ్లలో రజకుల సంక్షేమానికి రూ.125 కోట్లు, నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.80 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది.