‘వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా పర్లేదు’ అనేది నానుడి. ఏదైనా విందు భోజనం చేసేటప్పుడు వడ్డించేది మనోడే ఐతే మనకు మరింత భోజనం దొరుకుతుందని అర్థం.. తెలంగాణలో నేడు అదే నడుస్తున్నది. ఒక రైతే పాలకుడుగా ఉంటే రైతన్నలకు కావాల్సిన దానికన్నా ఎక్కువ మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో తెలంగాణకు రైతు పాలకుడుగా ఉన్నాడు. వ్యవసాయం గురించి స్పష్టమైన అవగాహన కలిగిన నేత ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో దండుగన్న వ్యవసాయం పండుగలా మారేందుకు బీజం పడింది. ఉరికొయ్యల దిక్కుచూసే రైతన్నకు బతుకుపై భరోసా కలిగింది. రైతును రాజును చేసేందుకు బంగారు తొవ్వ వేసింది.
ఒకనాడు తెలంగాణ రైతన్న ఎట్లుండే. నెర్రెలు వడ్డ నేలలు, నీళ్ళులేక బీళ్లుగా మారిన భూములు.. పెట్టుబడి కోసం అప్పులు, వర్షాలు లేక పంటలు ఎండిపోవుడు, కరెంట్, నీళ్ళులేక పంటలు పండక రైతన్న చేనులోనే పురుగులమందు తాగో, ఉరికొయ్యను ఎక్కో ఆత్మహ త్య చేసుకొనేటోడు. ‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా మన పంటచేలలోనా’ ‘వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోయె వానమ్మ’ అంటూ కరువుపాటలు పాడిందీ నేల.
‘చేత గోరమాయె, బతుకుబారమాయె, చేసేదేమిలేక బొంబాయి పోతున్న అమ్మమాయమ్మ’ అంటూ ఎవుసం చేయలేక బొంబాయి, బొగ్గుబాయి అంటూ వలస పోయి అక్కడే ప్రాణాలనొదిలిన చరిత్ర తెలంగాణ రైతన్నది.ఎకరాల్లో భూములున్నా, వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకొలేని పాలకుల మూలంగా రైతులు పట్నాలకు వలస వెళ్లి కార్మికులుగా, నిర్మాణ కూలీలుగా మారిన సందర్భాలు అనేకం. కంపెనీల్లో, హోటల్లల్లో, ఫంక్షన్ హాళ్లలో పనివాళ్లుగ మారిన దుంఖం తెలంగాణది.
అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ స్వరాష్ట్ర సాధనే దీనికి పరిష్కారమని కేసీఆర్ ఉద్యమించి తెలంగాణను సాధించారు.. స్వరాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు..
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాత తానెత్తుకున్నది పదవి కాదు బాధ్యత. తానెత్తుకున్న బాధ్యతను విజయవం తం చేసి తెలంగాణను అగ్రభాగాన నిలపాలనే సంకల్పంతో వ్యవసాయ రంగానికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయానికి ఆధారం నీళ్ళు, కరెంట్.. ఇవి బాగుంటే వ్యవసాయం సాఫీగా సాగుతుందని భావించి మిషన్ కాకతీయతో 46 వేల చెరువులకు మరమ్మత్తులు చేసి వాటికి పూర్వవైభవం తీసుకువచ్చారు. తద్వారా నీటి నిల్వ సామర్థ్యంతో పాటు భూగర్భజలాలు పెరిగేందుకు దోహదపడింది. వ్యవసాయానికి ఊతం దొరికింది. ఎవుసానికి నీళ్లతో పాటు విద్యు త్తు కూడా ముఖ్యం. అందుకే దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందించి ప్రకంపనలు సృష్టించారు కేసీఆర్. రైతులు పెట్టుబడుల కోసం దళారులను ఆశ్రయిం చి మోసం పోకుండా ఉండటం కోసం ప్రభుత్వమే రైతుకు పెట్టుబడి సాయం ‘రైతు బంధు’ పేరుతో అందిస్తూ దేశంలోనే ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఏటా ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబాలకు మరింత భరోసా ఇచ్చేందుకు ఎల్ఐసీ ద్వారా రైతు పేరున బీమా చేసి రూ.5 లక్షల బీమా అందే లా చేశారు.
కాళేశ్వరం లాంటి అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను మూడేండ్లలో పూర్తి చేసి గోదారమ్మను శిఖరపుటంచుకు ఎదురెక్కించిన అపర భగీరథుడు కేసీఆర్.. సకాలంలో ఎరువులు, సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలు అందేలా చర్యలు చేపట్టారు కేసీఆర్.
తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పాలనలో రైతుల సంక్షేమాభివృద్దే ఎజెండాగా కొనసాగింది. వందేండ్లలో జరుగని రైతు సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారు. దేశ రైతాంగాన్ని కేంద్రం ఇబ్బందులకు గురిచేసినా, రాష్ర్టానికి రావాల్సిన హక్కులను హరించినా, కక్ష పూరితంగా వ్యవహరించినా, కరోనా కష్టకాలంలోనూ రైతుకు చెందే ఏ కార్యక్రమాన్ని ఆపలేదు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం యావత్తు రైతన్నల కు కొండంత ధైర్యాన్ని, భరోసాను నింపింది. ఇంత క్లిష్టపరిస్థితుల్లో సైతం రైతన్నకు ప్రభుత్వం వెన్నం టి ఉండి ధైర్యం నింపటం గొప్ప విషయం. తొమ్మిదేండ్ల కాలంలో రూ.50 వేల కోట్ల విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించింది.72 లక్షల గృహాలకు సబ్సిడీ, 27.48 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంట్ను అందించారు సీఎం కేసీఆర్. అలాగే రుణమాఫీ నిర్ణయంతో రూ.19 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ, 29.61 లక్షల రైతులకు లబ్ధి చేకూర్చారు కేసీఆర్.
రైతు ఆత్మహత్యలకు కారణమైనోళ్ళు, వ్యవసాయాన్ని దండుగ అన్నోళ్ళు, హక్కులు అడిగితే కాల్చి చంపినోళ్ళు నేడు రైతు సంక్షేమమే ఎజెండాగా సాగుతున్న కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. రైతును రాజును చేయాలనేదే కేసీఆర్ దృఢసంకల్పం. ఆ సంకల్పమే కేసీఆర్ను రైతులకు ఇన్ని గొప్ప పథకాలు అందించేలా పురికొల్పింది. ఇది రైతు ప్రభుత్వం. రైతుల కోసం ఏర్పాటైన ప్రభుత్వం.
కేసీఆర్ చేస్తున్న రైతు సంక్షేమాభివృద్ధ్ది పరంపర కొనసాగాలంటే కేసీఆర్కు యావత్తు తెలంగాణ రైతాంగం మద్దతుగా నిలబడాలి.. కేసీఆర్ లాంటి రైతు నేత ముఖ్యమంత్రి గా ఉంటే మన రైతాంగం మరిం త అద్భుత విజయాలు సాధిస్తుంది. వ్యవసాయ సంక్షోభాలు చూసిన ఈ నేలన రైతుల సక్సెస్ను చూపిస్తున్న సీఎం కేసీఆర్కు తెలంగాణ సమాజమంతా అండ గా నిలుస్తుంది. రైతు వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టి రైతు సర్కార్ను ప్రజలు మరోమారు ఆశీర్వదిస్తారు. ఫిర్ ఏక్ బార్ కిసాన్ సర్కార్..
రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కరువు పాటలు పాడిన నేలన కాళేశ్వర నీళ్ళు పారుతున్నయ్. . ఉరికొయ్యలకెక్కిన నేలన జలోత్సవాలు జరుగుతున్నయ్..కరువు పోయి కన్నీళ్లు ఆగినయ్..గుండె బరువు పోయి బంగారు పంటలు పండినయ్..కల్వకుంట్ల వారే కాళేశ్వరుడై కరువును బాపిండు..బరువును తీర్చిండు.