సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. ఉమ్మ డి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి . తెలంగాణలో వ్యవసాయం నూటికి తొంభై శాతం చెరువులపై ఆధారపడి ఉన్నది. కానీ ఈ విషయాన్ని మరిచిన సీమాంధ్ర పాలకులు తెలంగాణలోని చెరువులను ఎండబెట్టారు. ఫలితంగా చెరువులన్నీ పూడికతో నిండిపోయాయి. చెరువులపై ఆధారపడి బతికే పల్లె జీవితాలు ఆగమాగమయ్యాయి. కృష్ణ , గోదావరి జీవనదుల నడుమ తెలంగాణ భూమి అలరారుతున్నా. తెలంగాణ రైతాంగం మాత్రం పంటలు పండక తీవ్రంగా నష్టపోయింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ప్రభుత్వం రైతాంగానికి , వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురికాబడ్డ తెలంగాణలోని ప్రతి చెరువును ఉపయోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ మిషన్ ద్వారా ప్రతి గ్రామంలోని చి న్నా చితక చెరువులను కూడా పూడిక తీసి వాటిని వాడుకలోకి తీసుకువచ్చింది. దీంతో గ్రామాల్లోని బీడు భూమి వ్యవసాయయోగ్యమయ్యింది. రైతే రాజు అన్న మాటను నిజం చేస్తూ తెలంగాణ అ మలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, పంట బీ మా, ధరణి లాంటి అనేక పథకాలతో తెలంగాణ రైతాంగం అభివృద్ధిలో ముందుకు పోతున్నది .
రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10 వేల చొప్పున ఇప్పటికే పలు విడుతల్లో 65 లక్షల మంది రైతులకు రూ.66వేల కోట్లను పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలో జమ చేసింది. 26 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కూడా రైతులకు ఉచితంగా అందిస్తూ రైతాంగానికి బాసటగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతే కాదు పండిన పంటకు మద్దతు ధరను అందిస్తు రైతుకు భరోసానిస్తున్నది. రైతు బీమాతో మరణించిన ఒక్కో రైతుకు 5 లక్షల చొప్పున లక్షా 782 రైతు కుటుంబాలకు రూ .5,039 కోట్లు పరిహారంగా చెల్లించి ఆదుకున్నది మన ప్రభుత్వం. 35.30 లక్షలమంది రైతులకు రుణమాఫీ చేసిం ది. పావలా వడ్డీ రుణాలను మంజూరు చేసింది.
కేసీఆర్ తీసుకొచ్చిన మార్పులను, వారికి భరోసాగా నిలబడిన తీరును చూస్తే నిజంగా ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలతో తెల్లారిన తెలంగాణలోనేనా మనం ఉన్నది అని అనిపించక మానదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్ప డే నాటికి తెలంగాణలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు ఉండగా అది నేడు 2.3 కోట్ల ఎకరాలకు పెరిగింది. దీనికి తోడు ఉద్యానవనాలు 11.50 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. 2014-15 నాటికి మన రాష్ట్రం లో ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులయితే 2022-23 నాటికి అది 2.49 కోట్ల టన్నులకు చేరింది. పత్తిసాగు 41.83 లక్షల ఎకరాలు కాగా 2022 నాటికి 63.51 లక్షల ఎకరాలకు విస్తరించింది. రైతులు పండించిన పంటను ఎలాంటి పరిమితులకు లోబడకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది. కల్తీ విత్తనాలను అరికట్టి నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించే క్రమంలో ‘సీడ్విలేజ్ ’ పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 31,891 క్లస్టర్లలో 2,56,600 ఎకరాల్లో 21 లక్షల 57 క్వింటాళ్ల విత్తనాలను ఉత్పత్తి చేసింది . తెలంగాణ వ్యాప్తంగా ఇట్లాంటి విత్తన ఉత్పత్తి కేంద్రాలను దాదాపు 400 కు పైగా నెలకొల్పి దేశంలోనే అగ్రగామిగా నిలిచింది తెలంగాణ . ఇందుకు గాను భారత ప్రభుత్వం తెలంగాణను ‘సీడ్హబ్’గా గుర్తించి సత్కరించింది .
పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడం వల్ల 6.66 లక్షల మంది రైతులకు లబ్ధికలిగింది. పండిన పంటలు పాడు కాకుండా గోదాముల సామర్థ్యాన్ని విపరీతంగా పెంచింది . గతంలో సామర్థ్యం 39 లక్షల మెట్రిక్ టన్నులు కాగా నేడు అది 68.28 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది.
ఈ విధంగా కేసీఆర్ సంకల్పించిన కోటి ఎకరాల స్వప్నం దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో తెలంగాణను ఎలాగైనా నాశ నం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయి. తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టియ చూస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలని ఒకరు, మోటర్లకు మీటర్లు పెడుతామని మరొకరు రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు.
అందుకే రైతులు మాత్రం వ్యవసాయం దండుగ కాదు పం డుగ చేసిన కేసీఆర్ వెంట ఉంటామని ఘంటాపథంగా చెప్తున్నారు. వ్యవసాయం దండుగ అన్నచోట నే పండుగ అయ్యింది. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది!
-జీ రాజేశ్ నాయక్
9603579115