అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ ముందుకు సాగుతుండగా గోరంత సమస్యలను కొండంతగా విష ప్రచారం చేయడం కొంత మందికి అలవాటుగా మారింది. మనం మంచి చేస్తున్నాము కదా..చెడు చెప్తే అయ్యేదేమున్నది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ‘చెడుతో సమాంతరంగా మంచిని కూడా ప్రచారం చేస్తూనే ఉండాలి’ అంటారు మన రాజ్యాంగ నిర్మాత డా॥ బీఆర్ అంబేద్కర్.
తెలంగాణ అభివృద్ధి సంక్షేమాన్ని యావత్తు భారతం కీర్తిస్తుంటే, తెలంగాణలోని కొంత మంది పనికట్టుకొని అధికారం కోసం అర్రులు చాస్తూ విమర్శలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో వందేండ్లలో జరగని అభివృద్ధి పదేండ్లలో జరిగిందన్నది వాస్తవం. ఎత్తైన దక్కన్ పీఠభూమిలో ఉన్న తెలంగాణ రాష్ర్టానికి ఘన చరిత్ర ఉన్నది. తెలంగాణను మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, రాష్ట్ర కూటులు, కాకతీయులు, ఢిల్లీ బహుమనీ సుల్తాను లు, గోల్కొండ సుల్తానులు, అసఫ్ జహీ రాజవంశస్తులు పాలించారు. 1948వరకు హైదరాబాద్ రాజ్యం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రపంచంలో అత్యంత ధనికుడిగా పేరుగాంచారు. అప్పట్లోనే రూ.660 కోట్ల సంపదతో ప్రపంచం లోనే కుబేరుడుగా టైమ్స్ మాగజైన్ ప్రచురించింది.
తెలంగాణలో కాకతీయుల, నిజాం నవాబుల కా లంలోనే కరువు, కాటకాల నివారణకు చెరువులు, కుం టలు తవ్వారు. వారి హయాంలోనే కాకతీయుల కళాతోరణం, వెయ్యి స్తంబాల గుడి, రామప్ప దేవాలయం, చార్మినార్, గోల్కొండ కోటలతో పాటు దేవాలయాలు, ఉస్మానియా ఆసుపత్రి, హుస్సేన్సాగర్, నిజాం సాగర్, రైల్వేలైన్లు, అద్భుతమైన భవనాల నిర్మాణాలు చేశారు. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాకముం దు..ఎంతో అభివృద్ధి చెందిన రాజ్యంగా ఖ్యాతి గాంచింది. నిజాం నవాబు పాలనలో ఉన్న హైదరాబాద్ ఆర్థ్ధికంగా బలమైన రాజ్యంగా ఉండేది. నిజాం నవాబు హయాంలో అభివృద్ధి గాంచిన హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనమైన తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబాటుకు గురైంది. ఆనాడు నవాబులు, కాకతీయులు చేసిన అభివృద్ధే మొన్నటి వరకు కనిపించేది. ఈక్రమంలో తెలంగాణ కోసం పోరాటం సాగించి సాధించిన తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో తెలంగా ణను దేశంలోనే నెంబర్1 గా నిలిపారు.
తెలంగాణ వస్తే కారు చీకట్లే..కరెంటు ఎక్కడి నుండి తెచ్చుకుంటారు..మీకు పాలన చేత కాదు..ఇలా ఒకటేమిటి పోతూ పోతూ సమైక్య పాలకులు ఇక్కడి ప్రజల్లో ఆందోళన, అలజడి రేపుతూ వెళ్లారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే మొదట్లోనే చెప్పారు. ఏడాదిపాటు కరెంటు కష్టాలు ఉంటాయని, తర్వాత మూడు నాలు గేండ్లలో 24గంటల కరెంటు సరఫరా చేసుకుంటామని. అన్నట్టుగానే నేడు 24 గంటల కరెంటు సరఫరా చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించారు కూడా.
తెలంగాణలో సాగునీటి వసతి లేకపోవడంతో వర్షాధారంగా, బోరుబావుల ఆధారంగా ఎక్కువగా సాగుచేసేవారు. సాగు నీటి వసతి లేకపోవడంతో..వానా కాలం పంటలే ఎక్కువగా సాగు చేసేవారు. తెలంగాణ లో నూటికి 95 శాతం చిన్న కమతాలు ఉన్న రైతులే కావడంతో వారికి వ్యవసాయంతో ఆమ్దాని తక్కువే. వ్యవసాయమే ఆధారం కావడంతో సాగు చేస్తేనే..పంట పండితేనే సంసారం సాగే అవకాశాలుండేవి. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం, పాస్ బుక్లను, పెయ్యి మీదున్న బంగారు, వెండి ఆభరణాలను కుదువపెట్టి మరీ డబ్బులు తెచ్చుకునేవారు.. మనం పవిత్రంగా భావించే తాళిని సైతం వ్యాపారుల వద్ద కుదువ పెట్టుకొని పెట్టుబడులు సమకూర్చుకున్న రైతుల దయనీయ జీవితాలు పల్లె పల్లెన కనిపిస్తుండేవి. ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఉషోదయపు వెలుగులా…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుకు అండ గా నిలుస్తున్నారు. 5 ఏండ్ల క్రితం ప్రారంభించిన రైతు బంధు పథకం రైతులకు కొండంత అండగా నిలిచింది. రైతు బంధు ద్వారా తెలంగాణలో 61.49 లక్షల మంది రైతులకు రూ. కోట్లు వెచ్చిస్తున్నారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
తెలంగాణ రాకముందు పంటలు పండక, అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు అనే కం. ఆత్మ హత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నా టి ప్రభుత్వాలు రూ.1.50 లక్షల పరిహారం అందించడానికి నానా కొర్రీలు పెట్టేవి. సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలకు అండగా ఉండటానికి పక్కా ప్రణాళికతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకాన్ని ప్రారంభించారు. రైతు మరణిస్తే వారం రోజుల్లో నామినీకి రూ.5లక్షల బీమా వచ్చే విధంగా ఎల్ఐసీతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నారు. ధరణితో అధికారుల చుట్టూ తిరుగకుండానే నయాపైసా ఖర్చు లేకుండాభూమి పట్టా చేసుకునే వీలు కలిగింది.
తెలంగాణకు వరప్రదాయినిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాలకు సా గు, తాగునీటి అవసరాలకు వర ప్రదాయనిగా మారిం ది.ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే 12లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. రైతు సమస్యలను చర్చించి పరిష్కరించడానికి రైతు సమన్వయ సమితీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారికోసం 2,638 రైతు వేదికలను నిర్మించింది. నీటి తీరువాను రద్దు చేసింది ప్రభుత్వం. పంట ధాన్యాలకు మద్దతు ధర అందించి కొనుగోలు చేయడం, కొన్న ధాన్యాన్ని నిల్వ చేయడం కోసం పెద్ద ఎత్తున గోదాము లు నిర్మించింది. బిందు, తుంపర సేద్యం కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. 75 శాతం సబ్సిడీతో పాలీహౌజ్ గ్రీన్హౌజ్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
పెద్ద ఎత్తున వ్యవసాయం సాగవడంతో పాటు 24 గంటల కరెంటు రావడంతో పారిశ్రామిక ప్రగతి సైతం ఊపందుకున్నది. తెలంగాణలో కూలీల సమస్య ఏర్పడటంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు వచ్చి ఇక్కడ వ్యవసాయంతో పాటు ఇతర పనులు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు.
వరి దిగుబడిలో 10 ఏండ్లలోనే పంజాబ్కు దీటుగా నిలిచింది తెలంగాణ. తొమ్మిదిన్నరేండ్ల్లలో సుమారు రూ.37వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసి రైతన్నకు అండగా నిలిచారు కేసీఆర్.ఈ ఏడాది 29.61 లక్షల రైతులకు రూ.19 వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం జరిగింది. పల్లె సీమలకు గుండెకాయల్లాంటి చెరువు, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి నూతన జవసత్వాలందించారు కేసీఆర్.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆనాడు అంబేద్కర్ రా జ్యాంగంలో ఆర్టికల్ 3 ను చేర్చకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన కష్టసాధ్యమయ్యేది. అందుకే సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
‘సంపద పెంచు ప్రజలకు పంచు’ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఉమ్మ డి పాలనలో రూ.200 మాత్రమే ఉన్న పింఛన్లను వి తంతువులు, వృద్ధులకు రూ.2016, వికలాంగులకు రూ.3016 అందించి పేదల గుండెల్లో నిలిచిపోయారు కేసీఆర్. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, పైలేరియా, డయాలసిస్ రోగులకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ.
ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లక్షా నూటపదహార్లు ఇవ్వడం వారి కుటుంబాలకు ఎంతో భరోసా నిస్తున్నది. రేషన్ కార్డుల మీద కుటుంబంలో ఎందరు ఉన్నా ప్రతి ఒకరికి 6 కిలోల చొప్పున అందిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుల మతాలకు సంబంధం లేకుండా అందరిని గౌరవించే అరుదైన సాంప్రదాయానికి తెరదీశారు.. ముఖ్యమంత్రి కేసీఆర్. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడంతో పాటు రంజాన్, క్రిస్మస్ను సైతం అదే స్థాయి లో ఆదరించారు. కేజీ టూ పీజీ విద్య పథకంలో భాగం గా పెద్ద ఎత్తున సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
కేసీఆర్ కిట్ పథకం తల్లి, బిడ్డకు ఎంతో ఉపయోగకరంగా మారింది. గ్రామ గ్రామాన బీటీ రోడ్లు, ఇండస్ట్రీ పాలసీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయానికి చేయూత, బీసీ బంధు ద్వారా కుల వృత్తులకు భరోసా, నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, సొంత స్థలంలో ఇండ్లు నిర్మించుకునే వారికి గృహలక్ష్మి ద్వారా రూ.3 లక్షల సహాయం, విద్యార్థులకు సన్నబియ్యం, ఆరోగ్యలక్షి, అమ్మఒడి, షీటీమ్స్, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్నెస్ కేంద్రాలు, పోలీస్ సంక్షేమం, అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంపు, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్ విధానం, మద్యం దుకాణాల లైసెన్స్ల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్, ధూపదీపనైవేద్యం పథకంలో రూ.10 వేలు, మత్స్యకారులకు చేపల పంపి ణీ, గీత కార్మికులకు ఈత, తాటి చెట్ల పన్ను రద్దు, గీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు 5లక్షల బీమా, చేనేతలకు గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడంతో పాటు తెలంగాణ చేనేత మగ్గం అనే పథకం ద్వారా చేయూతనిచ్చారు.
ఆర్టీసీలోని 43,373 మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం పిట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ సర్కారు రాకతో సింగరేణి దశ, దిశ మారిపోయింది. సింగరేణి టర్నోవర్ రూ.12 వేల కోట్ల నుంచి రూ. 33 కోట్లకు చేరుకున్నది.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిలువుటద్దంగా గ్రామాలు, పట్టణాలకు 13 జాతీయ అవార్డులు వచ్చాయి. గురుకుల పాఠశాలలను గణనీయంగా పెంచడంతోపాటు డైట్ చార్జీలు పెంచి విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తున్నారు. మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల అభివృద్ధి, ఐటీ పరిశ్రమలు, వైద్య కళాశాలలు, కంటి వెలుగు, ఉచిత డయాలసిస్ కేంద్రా లు, బస్తీ, పల్లె దవాఖానాలు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, హైదరాబాద్ నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన వర్గాలకు అండగా నిలబడటానికి. 4 లక్షల ఎకరాల పోడు భూ ములకు పట్టాలు అందించడంతో పాటు వారికి సైతం రైతుబంధు, రైతుబీమా వర్తిం పజేసిన ఘనత కేసీఆర్ది. అనాథ పిల్లలను ఆదుకోవడానికి వారిని రాష్ట్ర పిల్లలుగా గుర్తించిన గొప్ప మనసు సీఎం కేసీఆర్ ది.
మొత్తం మీద భారతదేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నెం1 రాష్ట్రంగా తీసుకెళ్తున్నారు కేసీఆర్.
75 ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితులను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడు. దీంతో వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధ్దిగా వారిని అభివృద్ధిలోకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు పథకం దేశంలోనే పెను సంచలనం సృష్టించింది. దళిత వర్గాలు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.