తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని వికలాంగులకు రూ.4016 నెలవారీ పింఛను అందజేసి వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపుతున్నది. గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో రూ.500 పింఛను మాత్రమే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మొత్తాన్ని రూ.3,016కు పెంచారు. పలు సంక్షేమ పథకాలు, విధానాల ద్వారా వికలాంగులకు నేటి ప్రభుత్వం చేరువవుతున్నది. దేశంలో సామాజిక భద్రతలో భాగంగా, సమాజంలో వెనుకబడిన వర్గాల్లో ఒకరైన దివ్యాంగులకు దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అత్యధిక వికలాంగులు ఉన్న రాష్ర్టాలు కూడా నేడు తక్కువ పింఛనే ఇస్తున్నాయి.
2022లో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యసభలో పొందుపరిచిన సమాచారం ప్రకా రం, దేశంలో ఎనిమిది రాష్ర్టాల్లో నెల కు రూ.500కంటే తక్కువ వికలాంగుల పింఛ న్ ఇస్తున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, నాగాలాండ్ వంటి రాష్ర్టాల్లో రూ.500 కంటే తక్కువ పింఛన్ అందిస్తున్నారు. మిజోరంలో అత్యల్పంగా రూ.100 పింఛన్ ఉన్నది. అత్యధిక లబ్ధిదారులు ఉన్న మహారాష్ట్ర వికలాంగులకు నెలకు రూ.300 మాత్రమే అందిస్తున్నది.
దేశంలో నేడు, వికలాంగులకు అత్యధిక నెలవారీ పింఛన్ ఇస్తున్న దక్షిణాది రాష్ట్రం మన తెలంగాణ. 569,712 మంది లబ్ధిదారులున్న తెలంగాణలో నెలకు రూ.3,016 అందిస్తున్నారు. అయితే ఈ పింఛన్ను మరో రూ.1000 పెంచుతూ గౌరవ సీఎం కేసీఆర్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అంటే ఇప్పటివరకు ఇచ్చే రూ.3116 పింఛన్ను రూ.4116కు పెంచుతున్నట్టు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రమై న మిజోరం నమోదు చేసుకున్న 200 మంది లబ్ధిదారులకు నెలకు రూ.100 (రోజుకు రూ.3)తో అతి తక్కువ పింఛను అందజేస్తున్నది. పెద్ద రాష్ర్టాల్లో, అత్యధికం గా నమోదైన వికలాంగులు 12,12,945 మంది ఉన్న మహారాష్ట్ర, 4,79,085 మం ది లబ్ధిదారులున్న మధ్యప్రదేశ్ రెండూ ఒక్కొక్కరికి రూ.300 నెలవారీ పింఛన్ ఇస్తున్నాయి. 3,86,305 మంది వికలాంగులున్న ఒడిశా రూ.200 అందిస్తున్నది. అలాగే జమ్ము-కశ్మీర్, లక్షద్వీప్, బెంగాల్, జార్ఖండ్లలో రూ.700, తమిళనాడులో రూ.1000, కేరళ రూ.1300, కర్ణాటక రూ.1100, హిమాచల్ ప్రదేశ్ రూ. 900, గోవా రూ.1700, అరుణాచల్ ప్రదేశ్ రూ.2200 మాత్రమే పింఛన్గా ఇస్తున్నాయి.
దేశంలో నేడు, వికలాంగులకు అత్యధిక నెలవారీ పింఛన్ ఇస్తున్న రాష్ట్రం మన తెలంగాణ. 5,69,712 మం ది లబ్ధిదారులున్న తెలంగాణలో నెలకు రూ.3,016 అందిస్తున్నారు. అయితే ఈ పింఛన్ను మరో రూ.1000 పెంచుతూ గౌరవ సీఎం కేసీఆర్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అంటే ఇప్పటివరకు ఇచ్చే రూ.3,016 పింఛన్ను రూ.4,016కు పెంచుతున్నట్టు తెలిపారు. ఇది దేశంలోనే అత్యధికం. ఈ విప్లవాత్మక నిర్ణయం దేశంలోని పలు రాష్ర్టాలను తప్పకుండా ప్రభావితం చే స్తుంది. ఎందుకంటే వికలాంగులకు తక్కు వ పింఛన్ ఇచ్చే రాష్ర్టాలకు ఇది ఒక సూచి క. కేసీఆర్ నిర్ణయాలు చాలా ముందుచూపుతో ఉంటాయి. అవి దేశంలో పలు రాష్ర్టాలు అనుసరించేలా. ఓ రకంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కేసీఆర్ది అందె వేసిన చేయి. తెలంగాణ తర్వా త, ఆంధ్రప్రదేశ్లో 6.59,163 మంది లబ్ధిదారులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నది.
20,952 మంది లబ్ధిదారులు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పు దుచ్చేరిలో, పింఛన్ నెలకు రూ. 2,000 నుంచి రూ.3,800 వర కు ఉంటుంది. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ 11,17,314 మంది దివ్యాంగులకు నెలకు రూ.1,000 మాత్రమే అందిస్తున్నది. దేశంలోని 34 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవ లం ఏడు మాత్రమే వికలాంగులకు రూ.2,000 కంటే ఎక్కువ పింఛన్ అందిస్తున్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పుదుచ్చేరి, తె లంగాణ, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి.
రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభు త్వం ఏడాదికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. అం తేకాకుండా, తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వం వికలాంగుల వివాహ ప్రో త్సాహకాన్ని రూ.50,000 నుంచి రూ. లక్షకు పెంచింది. మరోవై పు, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని గడపడానికి ప్రభు త్వం సబ్సిడీపై ఉపకరణాలను కూడా సరఫరా చేస్తున్నది. వికలాంగ అభ్యర్థులకు సబ్సిడీపై ఉపకరణాలు అందించేందుకు గత బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు చేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఉపకరణాలు అందజేస్తున్నది.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్, స్టడీ మెటీరియల్, సర్వీసుల్లో ప్రత్యేక అలవెన్సులు, వికలాంగులకు అవసరమైన చక్రాల కుర్చీలు, త్రీవీలర్ స్కూటీలు, వికలాంగులకు ప్రత్యేక విద్యను అందించేందుకు ఆశ్రమ పాఠశాల లు, హాస్టళ్లను ఏర్పాటు చేయడమే కా కుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందజేసి దైనందిన జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నది. వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచిస్తున్నది.
ఇటీవలి ప్రభుత్వ వికలాంగుల పింఛన్ పెంపుదల ప్రకట న హర్షణీయం. ఏది ఏమైనప్పటికీ వికలాంగుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణలుతీసుకురావాలని, దివ్యాంగులకు తక్కువ పింఛన్ ఇస్తున్న రాష్ర్టాలు తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీసుకొని పింఛ న్లు పెంచాలని ఆయా రాష్ర్టాల లబ్ధిదారులు కోరుతున్నారు.